Don't Miss!
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నెట్ఫ్లిక్స్లో ‘సత్యం’ రామలింగ రాజు బయోపిక్.. 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్'కి షాకిచ్చిన కోర్టు
రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ కి సంబంధించిన డాక్యుమెంటరీ సిరీస్ బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ అనే టీజర్ ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. నలుగురు భారతీయ బిలియనీర్ల జీవితం ఆధారంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు ప్రచారాలు గట్టిగానే చేశారు. విజయ్ మాల్యా, సుబ్రతా రాయ్, నీరవ్ మోడీ, రామలింగరాజు వంటి వారిని టార్గెట్ చేస్తూ సిరీస్ ని రూపొందించారని తెలియడంతో విషయం కోర్టు వరకు వెళ్ళింది.
షాక్ ఇచ్చిన సివిల్ కోర్టు
సెప్టెంబర్ 2 న ఓటిటి ప్లాట్ఫాంపై విడుదల అవుతున్న తరుణంలో ఊహించనివిధంగా ఆ సిరీస్ ని విడుదల చేయకుండా హైదరాబాద్ సివిల్ కోర్టు మంగళవారం నిరోధించింది. సత్యం కుంభకోణంలో దోషిగా తేలిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు నిషేధాన్ని జారీ చేసింది.
ప్రైవసీకి భంగం కలిగించేలా..
2018లో బెయిల్పై విడుదలైన రాజు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా స్టే ఆర్డర్ రావడం హాట్ టాపిక్ గా మారింది.తన ప్రైవసీకి భంగం కలిగించేలా నెట్ ఫ్లిక్స్ చేపడుతున్న ఈ చట్టవ్యతిరేకమైన చర్యను వెంటనే అపాలని వెబ్ సిరీస్ను విడుదల చేయకుండా నిరోధించాలని కోరారు. ఈ డాక్యుమెంటరీ లో చాలా వరకు అసత్యాలు ఉన్నాయని తన ప్రతిష్టను తగ్గించడానికే ఈ విధంగా కుట్ర పనిన్నట్లు రాజు పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన కేసు విచారణ కోర్టు పరిధిలో ఉన్నందున్న వెబ్ సిరీస్ను ఆపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
వైరల్ అవుతున్న ట్రైలర్
ఇక నెట్ఫ్లిక్స్ ఇప్పటికే వెబ్ సిరీస్ ట్రైలర్ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ వైరల్ అవుతున్న తరుణంలో రిలీజ్ కి బ్రేకులు పడ్డాయి. వివిధ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ ఈ డాక్యుమెంటరీ ప్రివ్యూ కోరింది. అతను ఇంతకుముందు తన న్యాయవాది ద్వారా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు, అయితే ఆ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది.
Recommended Video
సుబ్రతా రాయ్ పేరును ఉపయోగించకుండా..
ఇక, బీహార్లోని మరో న్యాయస్థానం నెట్ఫ్లిక్స్ను వెబ్ సిరీస్లో సుబ్రతా రాయ్ పేరును ఉపయోగించకుండా నిరోధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సత్యం కంప్యూటర్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు రామలింగరాజు కోర్టును ఆశ్రయించడంతో ఆ సిరీస్ కి కోర్టు బ్రేక్ వేసింది.