Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
మహేశ్ బాబు సినిమాలో అనుష్క: అసలు విషయం తెలిసి నోరెళ్లబెడుతోన్న ఫ్యాన్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను'తో భారీ హిట్ను అందుకున్న అతడు.. ఆ తర్వాత వంశీ పైడిపల్లి తీసిన 'మహర్షి'తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక, ఈ మధ్య అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ గురించి తాజాగా బయటకు వచ్చిన ఓ న్యూస్ కలకలం రేపుతోంది.
కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి కీలక పాత్రను పోషిస్తుందని తాజాగా ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందునా అది దర్శకుడు పరశురాం పోస్ట్ చేసినట్లు ఉండడంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు. కానీ, ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని తర్వాత తెలిసింది.
It is very pleasure to welcome @MsAnushkaSetty garu to #SarkaruVaariPaata team. Thanks for playing a powerful role in our film. I sure you will rock as bank manager role in our film. Can't wait to start shooting🥰@MythriOfficial #MaheshBabu @14ReelsPlus pic.twitter.com/wiNbvxiR5T
— Parasuram Petla (@ParasuramPetla5) November 17, 2020
అసలేం జరిగిందంటే.. పరశురాం పెట్లా అనే పేరుతో ఓ నెటిజన్ ట్విట్టర్లో అకౌంట్ క్రియేట్ చేశాడు. అది కూడా అచ్చం ఆ దర్శకుడి అధికారిక ఖాతాలాగే మెయింటైన్ చేశాడు. దీంతో అనుష్క వార్తను నిజమేనని అంతా నమ్మేశారు. ఇప్పుడు అసలు విషయం బయటకు రావడంతో అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
ఇదిలాఉండగా, వరుస విజయాలతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు చేస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైనర్స్తో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో బ్యాంకులను మోసం చేస్తున్న బడా బాబులను టార్గెట్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.