దక్షిణ భారతదేశ చలన చిత్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో కలెక్షన్స్ కురిపిస్తూ అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తున్న 'మగధీర" చిత్రానికి మరో అదనపు ఆకర్షణ చేరబోతోంది. గీతా ఆర్ట్స్ సంస్థ త్వరలో ఈ చిత్రంలో కొత్త సన్నివేశాన్ని జోడించబోతున్నారు. రామ్చరణ్, కాజల్, శ్రీహరి, రావురమేష్లపై దర్శకుడు రాజమౌళి ఎంతో కష్టపడి చిత్రీకరించిన ఓ చూడముచ్చటైన యాక్షన్ సన్నివేశాన్ని జతచేయనున్నారు. ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఆల్టైం రికార్డ్గా అత్యధిక సెంటర్స్లో అర్ధ శతదినోత్సవం జరుపుకోబోతున్నట్లు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తెలిపారు. చిత్ర నిడివిని తగ్గించే క్రమంలో తొలుత ఈ సన్నివేశాన్ని తొలగించవలసి వచ్చిందని, కాని చిత్రానికి వస్తున్న అపూర్వ స్పందన నేపథ్యంలో ఈ నెల 18నుంచి ఈ సన్నివేశాన్ని కలుపుతున్నామని ఆయన తెలిపారు. కనీ ఇది బిజినెస్ చేసుకోవడానికి ఓ ఎత్తుగడన్న వార్తలు వినిపిస్తున్నాయి.