Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వివాదాలకు దారి తీస్తున్న అల్లు అర్జున్ కుంతల జలపాతం సందర్శన.. పోలీస్ స్టేషన్లో పిర్యాదు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఒక్కసారిగా అభిమానులను ఈ న్యూస్ కొంత ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం ఈ విషయంలో అనేక రకాల కథనాలు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. అల్లు అర్జున్ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులపై కూడా పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పుష్ప లొకేషన్స్ కోసం
వివరాల్లోకి వెళితే.. ఇటీవల పుష్ప సినిమా కోసం లొకేషన్స్ ని సందర్శించడానికి అల్లు అర్జున్ తన టీమ్ తో కలిసి తిప్పేశ్వర్ ప్రాంతానికి వెళ్లారు. ఇక ఆ తరువాత ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల జలపాతాన్ని సందర్శించారు. అక్కడ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ కోసం ఫొటోగ్రాఫ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని
అయితే అల్లు అర్జున్ తో పాటు పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆరోపించారు. ఇక వారిపై బుధవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
అనుమతులు ఇవ్వకపోయినా..
అక్కడ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని అనుమతులు లేకుపోయినా నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినట్లు ఆరోపించారు. కుంతల జలపాతం సందర్శనకు అధికారులు అనుమతులు ఇవ్వలేదని అయినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు కొవిడ్ నిబంధనలు లెక్కచేయకుండా ప్రవర్తించినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Recommended Video
అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని..
ఇక అల్లు అర్జున్ కి సంబంధించిన ఫొటోలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో స్పెషల్ చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ వచ్చాడని పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా బన్నీని చూసేందుకు ఎగబడ్డారు. ఇక కోవిడ్ సమయంలో ఈ విధంగా బన్నీ బయటకు వచ్చి అనవసరంగా రూల్స్ ని బ్రేక్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆరోపించారు.