Don't Miss!
- News YS Jagan Stone Attack: జగన్ పై దాడి కేసు విచారణ-ఈసీ జోక్యం కోరిన టీడీపీ..!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అది శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చినట్లే: కొత్త కాన్సెప్ట్తో సినిమా, స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్
అప్పట్లో ఒక్కడుండేవాడు సినిమా శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చినట్లే ఉంది. ఆయన హీరోగా మరో చిత్రం త్వరలో ప్రారంభం కాబోతుంది. అది కూడా కొత్త కాన్సెప్ట్తో...
హైదరాబాద్: అప్పట్లో ఒక్కడుండేవాడు సినిమా శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చినట్లే ఉంది. ఆయన హీరోగా మరో చిత్రం ప్రారంభం కాబోతున్నది. 2016 చివరిలో మంచి కమర్షియల్ చిత్రంగా కొత్త కాన్సెప్ట్ తో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ అందుకున్న విషయం తెలిసిందే.
"అప్పట్లో ఓకడుండేవాడు" లాంటి న్యూవేవ్ మూవీతో గత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికిన యంగ్ హీరో శ్రీవిష్ణు, ఓ స్టార్ హీరో, ఇంకో ఇద్దరు పాపులర్ హీరో, హీరోయిన్స్ కాంబినేషన్ లో కాన్సెప్టెడ్ మల్టిస్టారర్ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఇంద్రసేన దర్శకుడిగా పరిచయం కానున్నారు. బాబా క్రియోషన్స్ బ్యానర్ పై డా. ఎం.వి.కె రెడ్డిగారు సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి లో సెట్స్ మీదికి వెళ్లనుంది.
దర్శకుడు ఇంద్రసేన మాట్లాడుతూ.." ఈ చిత్రం రెగ్యులర్ కమర్షయల్ చిత్రాల కంటే భిన్నంగా వుంటుంది. కొత్త కథ, కథనాలతో కంప్లీట్ వెస్ట్రన్ మూవీస్ బాటలో సాగుతుంది. ఈ చిత్రం లో సమాంతరంగా సాగే మూడు కథలుంటాయి. అందులో వుండే మూడు మిస్టరీస్ ని చేధించడం మీద ఈ కథ ఆధారపడి వుంటుంది. ఇది రొలర్ కాస్టర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మిగతా వివరాలు అతి త్వరలో మీకు తెలియజేస్తాం.." అని అన్నారు
డాక్టర్.
ఎం.వి.కె
రెడ్డి
సమర్ఫణ..
ప్రోడక్షన్
డిజైనర్-
రాజీవ్
నాయిర్,
సంగీతం-
సతీష్
రఘునాధన్,
నిర్మాత-
అప్పారావు
బెల్లాన
కథ,కథనం,
దర్శకత్వం-
ఇంద్రసేన
ఆర్