Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జయప్రద ముఖ్య పాత్రగా హారర్ చిత్రం ప్రారంభం
హైదరాబాద్: పాప్ కార్న్ స్పోర్ట్స్ ఎంటర్ టైనెంట్స్, వి.ఎన్.వి ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా ఓ హారర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. నీరజ్ వాలా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శనివారంనాడు చీర్యాల లోని నరసింహస్వామి గుడి ప్రాంగణంలో జరిగింది.
ఈ సందర్భంగా నటిమణి జయప్రద మాట్లాడారు. "చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. డబ్బు మాలిక్, నీరజ్ వాలా, అర్మాన్ మల్లిక్ వంటి బాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయనుండడం సంతోషకరం" ఆమె అన్నారు.
"గతంలో సంగీతం విభాగంలో పలు ఫిలిం ఫేర్ అవార్డులతోపాటు, అసంఖ్యాక అభినందనలు అందుకొన్న అర్మాన్ మల్లిక్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహించనుండడం విశేషం. ఈ చిత్ర నిర్మాత బాలగిరి నాకు 25 సంవత్సరాలుగా తెలుసు, మంచి మిత్రులు. నేడు ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాతో నటింపజేయడం ఆనందంగా ఉంది" అని అన్నారు.
"చీర్యాల చైర్మెన్ నర్సింహ్ గారు ఇక్కడకు విచ్చేసి మా చిత్ర బృందాన్ని అభినందించడం సంతోషంగా ఉంది. కామెడీకి ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని దర్శకుడు నీరజ్ వాలా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనుండడం చాలా సంతోషంగా ఉంది" అని జయప్రద అన్నారు.
గాయకుడు అర్మాన్ మల్లిక్ మాట్లాడుతూ... "అద్భుతమైన ప్రతిభావంతులందరూ కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రంలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. మా నాన్నగారు డబ్బు మాలిక్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి మా అన్నయ్య ఆమాల్ మాలిక్ సంగీతం సమకూర్చుతున్నారు" అన్నారు.
దర్శకుడు నీరజ్ వాలా మాట్లాడుతూ... "సీనియర్ నటీమణి జయప్రదగారు ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని రూపొందిస్తుండడం ఆనందంగా ఉంది. నర్సింహ స్వామి ఆశీస్సులు లభించి మా ఈ ప్రయత్నం ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.