Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహాత్మాగాంధీ హత్య కుట్రపై సినిమా
ఈ పుస్తకాన్ని ప్రచురించిన రోలీబుక్స్ ఈ విషయాన్ని సోమవారం ఇక్కడ ప్రకటించింది. 2014 జనవరిలో ఈ సినిమా విడుదలౌతుంది. మహాత్మాగాంధీ 66వ వర్థంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. మహాత్మాగాంధీ హత్య జరిగిన ప్రదేశమైన ఢిల్లీలోని బిర్లాహౌస్కు మూడో ఇంట్లోనే రచయిత మల్గోంకర్ అప్పట్లో ఉండేవారు.
ఇక గతంలో రాజీవ్ గాంధీ ,ఇందిరా గాంధీ వంటి ప్రముఖుల హత్యల వెనక ఉన్న కుట్రలపై చిత్రాలు వచ్చాయి. ఇంకా తీయటానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ దగ్గర..ఏక్ హసీనా ధీ, మిస్టర్ యా మిసెస్, నిశ్శబ్ద్ చిత్రాలకు అశోసియేట్ గా పనిచేసిన సురిందర్ హివరలే త్వరలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంతో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు ప్రారంభించారు.
ప్రముఖ పాత్రికేయుడు రాజీవ్ శర్మ రాసిన ఓ పుస్తకం ఆధారంగా చిత్ర కథ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయమై సురిందర్ హివరలే మాట్లాడుతూ...నేను గత తొమ్మిది నెలలుగా ఈ స్క్రిప్టు పనులోనే బిజీగా ఉన్నాను. పూర్తి సంతృప్తిగా స్క్రిప్టు వచ్చాకే షూటింగ్ కి వెళ్ళాలనుకున్నాను. ఆ దశ వచ్చింది. వర్మ శిష్యుడిగా నేను ఎప్పుడూ గర్వపడుతూంటాను. ఆయన గతంలో తీసిన కల్ట్ ఫిలింల తరహాలోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తాను. షూటింగ్ లో ఎక్కువ భాగం శ్రీలంక, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో జరుపుతాం. కథలో కొన్ని కీలక సన్నివేశాల్ని ఇటలీలోనూ తెరకెక్కిస్తాను అన్నారు.