Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
దర్శకేంద్రుడికి నచ్చిన కొత్త హీరోయిన్
లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో భాగంగా పరిసరాల పరిశీలన నిమిత్తం ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు కంచికచర్ల విచ్చేశారు. స్థానిక శ్రీ శివసాయి క్షేత్ర పరిసరాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు గద్దె ప్రసాద్, పావని దంపతులు, వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు విలేకరులతో మాట్లాడుతూ లకీప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై నిర్మించే ఈ చిత్రం (ఇంకా పేరు పెట్టలేదు) లో విలక్షణ నటుడు మోహన్బాబు కుమారుడు మంచు మనోజ్కుమార్ హీరోగా నటిస్తారని చెప్పారు.
ఆయనకు జోడీగా తపస్వి అనే నూతన తారను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, సుధ, ఆహుతి ప్రసాద్ తదితరులు నటిస్తారన్నారు. ప్రముఖ ఛాయాగ్రహకుడు ఎస్ గోపాల్రెడ్డి కెమెరామన్గా వ్యవహరిస్తారన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి శివసాయి క్షేత్ర ప్రాంగణంలో వారం రోజులపాటు ఓ పాటను చిత్రీకరించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిత్రీకరించే ఈ గీతానికి శివసాయి క్షేత్రం లొకేషన్ చక్కగా సరిపోతుందని, దీంతో ఇక్కడ షూటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ (చిన్ని), మాజీ సర్పంచ్ గద్దె సరస్వతి పాల్గొన్నారు.