Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కొత్త ఒక వింత పాత ఒక రోత
కొత్తనీరొచ్చి పాతనీరు పోయినట్టుగ కొత్త హీరోయిన్లు వచ్చి పాత హీరోయిన్లు ఇతర భాషలకు సంబందిచిన ఇండస్ట్రీలో కాలు మోపడం, నిర్మాతలు గా మారడం, పెళ్ళిల్లు చేసుకోవడం వంటివి చిత్ర పరిశ్రమలో సహజాతిసహజం. అసిన్, త్రిష, నయనతార, ఇలియానా, కాజల్, తమన్నా తదితరుల రాకతో, అప్పటివరకూ అగ్ర కథానాయికలుగా అలరించినవారు పెళ్ళిళ్లు చేసుకోవడమో, లేక ఇతర భాషలకు తరలిపోవడమో జరగడం మనకు తెలిసిందే. అదేవిధంగా, ఇప్పుడు టాప్ లిస్ట్ లో తిరుగులేని కథానాయికలుగా చెలామనిఅవుతున్న ఇలియానా, కాజల్, అనుష్క, తదితర టాలీవుడ్ తారామణులకు చెక్ చెప్పేందుకు మరికొందరు కొత్తమ్మాయిలు తెలుగులో తెరంగేట్రం చేస్తున్నారు.
ప్రభాస్-పూరీ జగన్నాధ్ల 'ఏక నిరంజన్"తో కంగనా రనౌత్ తెలుగు తెరంగేట్రం చేస్తున్నది. నాగార్జునతో శివప్రసాద్రెడ్డి నిర్మిస్తున్న ఇంకా టైటిల్ ఖరారు చేయని చిత్రం ద్వారా 'చిత్రాంగద" అనే బాలీవుడ్ బ్యూటీ పరిచయమవుతుండగా, నాగార్జున తనయుడు నాగచైతన్య ద్వితీయ చిత్రంలో తమిల నటి 'సమంతా" అనే సుందరి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. ఇకపోతే కొత్త హీరోయిన్లను పరిచయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే 'పవన్ కళ్యాణ్" తన తాజా చిత్రం 'కొమరం పులి"తో నికిషా పటేల్తో తెలుగు తెరంగేట్రం చేయిస్తున్నారు.అమీషా పటేల్, రేణుదేశాయ్, కీర్తిరెడ్డి తదితరులు పవన్కళ్యాణ్ చిత్రాల ద్వారా పరిచయమైనవారేనన్న విషయం తెలిసిందే. అలాగే, డాడి.రామానాయుడు మనవడు రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న 'లీడర్" చిత్రం ద్వారా 'ప్రియా ఆనంద్" వెండి తెరపై తళుక్కుమననుంది. గీతాకృష్ణ స్వీయనిర్మాణంలో రూపొందిస్తున్న 'కాఫీబార్" చిత్రం ద్వారా బియాంకదేశాయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నది. మరి వీరిలో ఎవరు తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎవరు కొల్లగొట్టగలుగుతారో వేచి చూడాలి!