Don't Miss!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నితిన్ కల్యాణానికి కొత్త ముహూర్తం కుదిరింది!
నితిన్ నటిస్తున్న తాజగా చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు. సాంప్రదాయ వివాహబంధ విలువని తెలియజెప్పేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నితిన్, రాశి ఖన్నా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
దాదాపు 15 ఏళ్ల తరువాత నితిన్ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 2003 లో వచ్చిన దిల్ చిత్రం తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మొదట ఈ చిత్రాన్ని జులై లో విడుదల చేయాలని భావించారు. కానీ అనుకోని కారణాల వలన ఈ చిత్రం వాయిదా పడింది. తాజగా ఈ చిత్ర విడుదలకు ముహూర్తం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆగష్టు 9 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. నితిన్ గత రెండు చిత్రాలు లై, ఛల్ మోహన్ రంగ నిరాశ పరచడంతో ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు.