Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఎంఎం శ్రీలేఖ న్యూ ఇయర్ స్పెషల్ సాంగ్
ప్రముఖ గాయని , సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆల్బం రూపొందించారు. ''తొలి అడుగైన, తొలి వలపైనా... జీవితంలో తొలి సంగటనలు ఎంతో మధురం'' అంటూ సాగే ఈ పాట....కొత్త సంవత్సరంలో తొలి రోజును ఎన్నో ఆనందాలతో ప్రారంభించాని యువతను ఉత్సాహ పరుస్తోంది. రచయిత సిరాశ్రీ ఈ గీతాన్ని రచించగా...శ్రీలేఖ ఆలపించారు. హైదరాబాద్ లో పలు లోకేషన్లలో ఈ పాటని చిత్రీకరించారు. ఇప్పటి వరకూ తెరవెనుక గాయనిగా , సంగీత దర్శకురాలిగా ప్రీక్షకులకు, శ్రోతలకు పరిచయమైన శ్రీలేఖ....ఈ ఆల్బం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ ఆల్బం విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎప్పటినుండో ఓ ప్రైవేటు ఆల్బం రూపొందించాలనే ఆలోచన ఉందని, ఇప్పటికి తన ఆలోచన కార్యరూపం దాల్చింది చెప్పుకొచ్చారు. ఈ నూతన సంవత్సరం తనకు ప్రేక్షకులకు మంచి జరగాలని, అందరూ హ్యాపీ గా ఉండాలనే ఆకాంక్షతో దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఎంఎం. శ్రీలేక శ్రీహరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సర్కారీ గుండా' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.