Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎంఎం శ్రీలేఖ న్యూ ఇయర్ స్పెషల్ సాంగ్
ప్రముఖ గాయని , సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆల్బం రూపొందించారు. ''తొలి అడుగైన, తొలి వలపైనా... జీవితంలో తొలి సంగటనలు ఎంతో మధురం'' అంటూ సాగే ఈ పాట....కొత్త సంవత్సరంలో తొలి రోజును ఎన్నో ఆనందాలతో ప్రారంభించాని యువతను ఉత్సాహ పరుస్తోంది. రచయిత సిరాశ్రీ ఈ గీతాన్ని రచించగా...శ్రీలేఖ ఆలపించారు. హైదరాబాద్ లో పలు లోకేషన్లలో ఈ పాటని చిత్రీకరించారు. ఇప్పటి వరకూ తెరవెనుక గాయనిగా , సంగీత దర్శకురాలిగా ప్రీక్షకులకు, శ్రోతలకు పరిచయమైన శ్రీలేఖ....ఈ ఆల్బం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ ఆల్బం విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎప్పటినుండో ఓ ప్రైవేటు ఆల్బం రూపొందించాలనే ఆలోచన ఉందని, ఇప్పటికి తన ఆలోచన కార్యరూపం దాల్చింది చెప్పుకొచ్చారు. ఈ నూతన సంవత్సరం తనకు ప్రేక్షకులకు మంచి జరగాలని, అందరూ హ్యాపీ గా ఉండాలనే ఆకాంక్షతో దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఎంఎం. శ్రీలేక శ్రీహరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సర్కారీ గుండా' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.