Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
న్యూస్ మేకర్ 2017: ఏం మాయ చేసిందో.. అక్కినేని ఇంటి కోడలిగా సమంత
దక్షిణాది సినీ పరిశ్రమలో అందం, అభినయంతో మెప్పించిన యువ హీరోయిన్లలో ఒకరు సమంత అక్కినేని. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేశావే చిత్రంలో అక్కినేని నాగచైతన్యతో జతకట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, మనం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తొలి చిత్రంలో నాగ చైతన్యతో నటించిన సమంత కొద్ది సంవత్సరాలు అఫైర్ కొనసాగించింది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలిగా మారింది.
Recommended Video
అక్కినేని నాగచైతన్యతో సమంత వివాహం 2017 అక్టోబర్ 6, 7 తేదీలలో గోవాలో నిరాడంబరంగా జరిగింది. నవంబర్ 12వ తేదీన హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మ్యారేజ్ రిసెప్షన్ను అక్కినేని నాగార్జున చాలా గ్రాండ్గా నిర్వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు, దక్షిణాది సినీ పరిశ్రమలో వీరి వివాహం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
నాగచైతన్యతో వివాహం తర్వాత నాగార్జునతో కలిసి రాజుగారి గది2 చిత్రంలో సమంత నటించింది. ప్రస్తుతం సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మహానటి చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. అలాగే కన్నడంలో ఘనవిజయం సాధించిన యూటర్న్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారే అవకాశం కూడా ఉందని వార్త వినిపిస్తున్నది. ఇలా అనేక సంచలన విషయాలతో సమంత 2017లో ఓ న్యూస్ మేకర్గా మారింది.