twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ హీరోయిన్‌కి....ఎంఎస్ రాజు ‘రమ్’ మత్తు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : 'రమ్'(RUM)....ఇదేదో మత్తు పానీయం పేరులా ఉంది కదూ! కానీ ఇదో సినిమా పేరు. రంభ, ఊర్వశి, మేనక....మూడు పేర్లను కలగలిపి ముగ్గురు భామల అందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించే కాన్సెప్టుతో రూపొందుతున్న సినిమా. సినిమాను నిర్మిస్తున్నది, దర్శకత్వం వహిస్తున్నది ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. ఈచిత్రం టైటిలోని అర్థం RUM (రంభ, ఊర్వశి, మేనక) అన్నమాట.

    ఈచిత్రంలో రంభగా త్రిష, మేనక పాత్రలో పూర్ణ ఎంపికవగా.....ఊర్వశి పాత్రకు మాత్రం అన్వేషణ సాగుతోంది. తాజాగా ఊర్వశి పాత్రకు హీరోయిన్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ 'పులి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన నికీషా పటేల్ ఊర్వశి పాత్రకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

    'నేను తెలుగులో మూడో సినిమాకు సైన్ చేసాను. ఎంఎస్ రాజు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రమ్' చిత్రలో ఊర్వశి పాత్ర చేయబోతున్నాన్నాను' అంటూ ట్వీట్ చేసింది. పులి తర్వాత తెలుగులో నికీషాకి సినిమా అవకాశాలేవీ రాలేదు. ఈ మధ్యనే కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న 3డి మూవీ 'ఓం' చిత్రంలో ఒక హీరోయిన్ పాత్రకు ఎంపికయింది. 'రమ్' ఆమె తెలుగులో చేయబోతున్న మూడో చిత్రం.

    ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో విడుదల కానుంది. నిర్మాతగా తెరంగ్రేటం చేసిన ఎంఎస్ రాజ ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి. ఇటీవల తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వంలో వేలు పెట్టి చేయి కాల్చుకున్నారు. మరి ఈ సినిమాలో ఎంఎస్ రాజు పని తీరు ఎలా ఉంటుందో చూడాలి.

    English summary
    
 "I have signed my third telugu film! ms raju is producer title called rum (rambha urvasi menaka) ill be playing urvashi..." Nikesha Patel told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X