twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ అంత్యక్రియలకు ఎందుకు రాలేదు.. లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా?..ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

    |

    బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై చెలరేగిన రగడం ఇంకా ఆరడం లేదు. రోజురోజుకూ మరింతగా పాకిపోతోంది. నెపోటిజం, కొందరి ఆగడాల వల్లే సుశాంత్ మరణించాడని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేకుండా చేసిన డిప్రెషన్‌కు గురయ్యేలా చేశాడని అందరూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో డిప్రెషన్ గురించి పెద్ద చర్చే జరిగింది. సుశాంత్ మరణంపై కొందరు సెలెబ్రిటీలు బాలీవుడ్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ నికీషా పటేల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    Recommended Video

    Sushant Singh Rajput : Bollywood పై హీరోయిన్ Satire.. భోజనం చేస్తూ బిజీ గా ఉన్నారా ?

    సల్మాన్‌ఖాన్‌పై విమర్శలకు కౌంటర్ ఇచ్చిన సోదరుడు.. దబాంగ్ దర్శకుడిపై కేసు నమోదుసల్మాన్‌ఖాన్‌పై విమర్శలకు కౌంటర్ ఇచ్చిన సోదరుడు.. దబాంగ్ దర్శకుడిపై కేసు నమోదు

    సుశాంత్ మృతి..

    సుశాంత్ మృతి..

    హీరో సుశాంత్ సింగ్ ఆదివారం ఉదయం బాంద్రాలోని తన నివాసంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ ఇలా చివరకు తన చనువు చాలించాడు. సుశాంత్ మృతి పట్ల సోషల్ మీడియా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.

    వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు..

    వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు..

    సుశాంత్ ఆత్మహత్యపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. కరణ్ జోహర్, కపూర్ ఫ్యామిలీ, ఖాన్ ఆధిపత్యం వల్లే సుశాంత్ మరణానికి కారణమని నెటిజన్లు ఆరోపించారు. ఈ మేరకు కరణ్ జోహర్, అలియా భట్, సల్మాన్ ఖాన్‌ను విపరీతంగా ట్రోల్స్ చేశారు. కొందరు సెలెబ్రిటీలు సైతం బాలీవుడ్ తీరును తప్పుబట్టారు.

    బాలీవుడ్‌లోని లోపాలు..

    బాలీవుడ్‌లోని లోపాలు..

    వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, మీరా చోప్రా, పాయల్ ఘోష్, పూనమ్ కౌర్, శ్రీ రెడ్డి వంటి వారు బాలీవుడ్‌ను వేలెత్తి చూపారు. ఇకనైనా పద్దతి మారాలని, ప్రతిభకు పట్టం కట్టాలని వివేక్ కోరాడు. బాలీవుడ్‌లో జరుగుతున్న మోసాలు, అక్కడి ఆధిపత్యం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. గత ఐదారు రోజుల నుంచి ట్విట్టర్ ఇదే విషయమై అంతా మాట్లాడుకుంటున్నారు.

    లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా?

    లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా?

    సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు హజరుకాకపోవడాన్ని నికీషా వేలెత్తి చూపింది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘నాది ఒక్కటే ప్రశ్న.. సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ పెద్దలెవ్వరూ ఎందుకు హాజరు కాలేదు. వారి మానవత్వం ఎక్కడుంది? వారు లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా?' అని సెటైర్స్ వేసింది. కొమురం పులి చిత్రంతో నికీషా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

    English summary
    Nikesha Patel Questioned Bollywood Didn't Attending Sushant Singh Last Rituals. I just have one question. Why did none of the big shots of bollywood not attend #SushantSinghRajput last respects funeral? Where was humanity now! Too busy having lunch???
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X