Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సుశాంత్ అంత్యక్రియలకు ఎందుకు రాలేదు.. లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా?..ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై చెలరేగిన రగడం ఇంకా ఆరడం లేదు. రోజురోజుకూ మరింతగా పాకిపోతోంది. నెపోటిజం, కొందరి ఆగడాల వల్లే సుశాంత్ మరణించాడని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేకుండా చేసిన డిప్రెషన్కు గురయ్యేలా చేశాడని అందరూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో డిప్రెషన్ గురించి పెద్ద చర్చే జరిగింది. సుశాంత్ మరణంపై కొందరు సెలెబ్రిటీలు బాలీవుడ్కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ నికీషా పటేల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Recommended Video
సల్మాన్ఖాన్పై విమర్శలకు కౌంటర్ ఇచ్చిన సోదరుడు.. దబాంగ్ దర్శకుడిపై కేసు నమోదు
సుశాంత్ మృతి..
హీరో సుశాంత్ సింగ్ ఆదివారం ఉదయం బాంద్రాలోని తన నివాసంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా డిప్రెషన్కు లోనైన సుశాంత్ ఇలా చివరకు తన చనువు చాలించాడు. సుశాంత్ మృతి పట్ల సోషల్ మీడియా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.
వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు..
సుశాంత్ ఆత్మహత్యపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. కరణ్ జోహర్, కపూర్ ఫ్యామిలీ, ఖాన్ ఆధిపత్యం వల్లే సుశాంత్ మరణానికి కారణమని నెటిజన్లు ఆరోపించారు. ఈ మేరకు కరణ్ జోహర్, అలియా భట్, సల్మాన్ ఖాన్ను విపరీతంగా ట్రోల్స్ చేశారు. కొందరు సెలెబ్రిటీలు సైతం బాలీవుడ్ తీరును తప్పుబట్టారు.
బాలీవుడ్లోని లోపాలు..
వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, మీరా చోప్రా, పాయల్ ఘోష్, పూనమ్ కౌర్, శ్రీ రెడ్డి వంటి వారు బాలీవుడ్ను వేలెత్తి చూపారు. ఇకనైనా పద్దతి మారాలని, ప్రతిభకు పట్టం కట్టాలని వివేక్ కోరాడు. బాలీవుడ్లో జరుగుతున్న మోసాలు, అక్కడి ఆధిపత్యం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. గత ఐదారు రోజుల నుంచి ట్విట్టర్ ఇదే విషయమై అంతా మాట్లాడుకుంటున్నారు.
లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా?
సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు హజరుకాకపోవడాన్ని నికీషా వేలెత్తి చూపింది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘నాది ఒక్కటే ప్రశ్న.. సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ పెద్దలెవ్వరూ ఎందుకు హాజరు కాలేదు. వారి మానవత్వం ఎక్కడుంది? వారు లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా?' అని సెటైర్స్ వేసింది. కొమురం పులి చిత్రంతో నికీషా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.