Don't Miss!
- News కేసీఆర్ డ్రామా అదిరిందయ్యా చంద్రం!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
ఫస్ట్ టైం బికీనీ వేసాను : పవన్ హీరోయిన్ ట్వీట్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'పులి' చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన నికీషా పటేల్, ఆ సినిమా ప్లాపు కావడంతో ఇప్పటి వరకు మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఈ నెల 19న విడుదల కాబోతున్న కళ్యాణ్ రామ్ 'ఓం' 3డి చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'ఓం' చిత్రంలో నికీషా అందాల ప్రదర్శన అందరికీ ఆకట్టుకోనుంది. ఈ చిత్రంలో ఆమె తన కెరీర్లోనే తొలిసారిగా బికీనీ అందాలతో కనువిందు చేయబోతోంది. ఈ విషయాన్ని నికీషా తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. బికీనీలో అమ్మడు ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
ఓం చిత్రంలో కృతి కర్బందా, నికీషా పటేల్ హీరోయిన్స్. సునీల్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు. 3డిలో రూపొందుతున్న 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు.
ఈ చిత్రంలో కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్రాజు, కళ: కిరణ్, స్టీరియోగ్రాఫర్స్: డేవిడ్ మైక్టేలర్, మార్కస్, మజ జ్డోవిన్స్కీ; ఫైట్స్: విజయ్, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్.