Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిఖిల్ కూడా పూర్తి చేశాడు.. ఆ హీరోయిన్లకు హీరో సవాల్
మూడో దశ గ్రీన్ ఇండియా చాలెంజ్ను ప్రభాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో గ్రీన్ ఇండియా చాలెంజ్కు మంచి స్పందన వస్తూ ఉంటుంది. హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు అందరూ కూడా మొక్కలు నాటి గ్రీన్ ఇండియాగా మార్చేందుకు తమ వంతు సాయం చేస్తుంటారు. మళ్లీ ఈ మధ్య రామ్ చరణ్ గ్రీన్ ఇండియా చాలెంజ్ను రామ్ చరణ్ ప్రారంభించాడు. అప్పుడెప్పులో ప్రభాస్ విసిరిన చాలెంజ్ను స్వీకరించి.. మొక్కలు నాటి.. అలా ముందుకు కొనసాగించాడు.
ఇప్పుడు యంగ్ హీరో కార్తికేయ వంతు వచ్చింది. నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన చాలెంజ్ను స్వీకరిస్తూ.. మొక్కలు నాటాడు. తాను నాటడమే కాకుండా తన 18 పేజీలు చిత్రయూనిట్కు చాలెంజ్ విసిరాడు. అంతే కాకుండా తన హీరోయిన్లు అనుపమా పరమేశ్వరణ్, అవికా గోర్లకు మొక్కలు నాటాలని సవాల్ విసిరాడు. మొక్కలు నాటి గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాలు పంచుకున్నందు థ్యాంక్స్ అంటూ ఎంపీ సంతోష్ నిఖిల్ను ప్రశంసించాడు.
మరో వైపు ఐశ్వర్యా రాజేష్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించింది. ఎంపీ సంతోష్ పిలుపు మేరకు ఈ మొక్కలు నాటుతున్నానని చెప్పింది. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా ఈ చాలెంజ్ను స్వీకరించండి.. నా ఫ్యాన్స్ అందరూ కూడా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సమానమేనని, మీరు మొక్కలు నాటి నాకు షేర్ చేయండి.. నేను వాటిని పోస్ట్ చేస్తానని అభిమానుల్లో ఐశ్వర్యా రాజేష్ ఉత్సాహాన్ని నింపింది.