Don't Miss!
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ప్రమాదంలో చిక్కుకున్న నిఖిల్.. హిమపాతంలో కూరుకుపోయిన కార్తీకేయ2 టీమ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లి తర్వాత వరుస ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. గతంలో తనకు మంచి పేరు తెచ్చిన కార్తీకేయ మూవీకి సీక్వెల్గా కార్తీకేయ2 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీమ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో హిమపాతంలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని కార్తీకేయ2 టీమ్ వీడియో ద్వారా వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..
5118 ఏళ్ల క్రితం నాటి కథతో
కార్తీకేయ 2 సినిమా విషయానికి వస్తే.. 5118 ఏళ్ల క్రితం నాటి కథతో వినూత్నమైన కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అనంత జ్ఞాన సంపద కోసం జరిగే అన్వేషణగా కథ సాగుతుందనేది ప్రాథమిక సమాచారం. స్వార్థానికి ఒకరు, సాధించడానికి ఒకరు. అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు' అనే విభిన్నమై స్టోరీ లైన్తో రూపొందిస్తున్నారు.
కార్తీకేయ సినిమాకు సీక్వెల్గా
2014లో వచ్చిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్గా వస్తున్న చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగు నిర్విరామంగా జరుగుతున్నది.
హిమాచల్ ప్రదేశ్లో షూటింగ్
కార్తీకేయ 2 సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్లోని సిస్సు ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా క్షీణించాయి. దాదాపు మైనస్ 6 డిగ్రీల ఉష్ణోగ్రతలో భారీగా కురుస్తున్న హిమపాతంలోయాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కుండపోతగా మంచు వర్షం
కుండపోతగా మంచు కురుస్తున్న ప్రాంతంలో కార్తీకేయ టీమ్ చిక్కుబడింది. వ్యాన్స్, కారవాన్స్లోనే ఉంటూ నితిన్, ఇతర యూనిట్ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా డైరెక్టర్ చందు మొండేటి యాక్షన్ కట్ చెబుతూ కనిపించారు.
నితిన్ ముఖంలో ఆందోళన
సిస్సు ప్రాంతంలో బయట హైఅలర్ట్ ప్రకటించారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ నితిన్ మాటలు వినిపించాయి. చలిని తట్టుకొవడానికి మంట పెట్టుకొని వేడిని ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నితిన్ ముఖంలో ఓ రకమైన నిర్వేదం కనిపించింది.