twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిఖిల్-స్వాతి జంటగా 'మాగ్నస్ సినీ ప్రైమ్ ' చిత్రం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : 'స్వామి రారా' లాంటి హిట్ చిత్రంలో నటించిన నిఖిల్, స్వాతి మరోసారి జంటగా నటించబోతున్నారు. 'మాగ్నస్ సినీ ప్రైమ్' సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్‌తో కూడిన వినోదాత్మక చిత్రం‌గా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. జూన్ నెల తొలి వారంలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని. నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ; కధ- మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.

    ఈ మధ్య హిట్ పెయిర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'స్వామి రారా' చిత్రంతో హిట్ కొట్టిన నిఖిల్, స్వాతిలతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసారు. ఇటీవల ఇష్క్ చిత్రంతో హిట్ కొట్టిన నితిన్-నిత్యా మీనన్ ఆ వెంటనే నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

    English summary
    Nikhil and Swathi’s latest film is Swamy Ra Ra which turned out to be good hit. Here is the latest news that Nikhil and Swathi are going to pair up for the second time for an untitled film. Nikhil and Swathi are expected to pair up for second under the direction of debutant Chandu Mondeti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X