Don't Miss!
- Finance DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Automobiles జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- News జగన్ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలకు ఎన్డీయే కూటమి సవాల్ ఇలా..!
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Sports Kavya Maran: తిలక్ వర్మ..నీకు దండంరా బాబు! video
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
నిఖిల్-స్వాతి జంటగా 'మాగ్నస్ సినీ ప్రైమ్ ' చిత్రం
హైదరాబాద్ : 'స్వామి రారా' లాంటి హిట్ చిత్రంలో నటించిన నిఖిల్, స్వాతి మరోసారి జంటగా నటించబోతున్నారు. 'మాగ్నస్ సినీ ప్రైమ్' సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్తో కూడిన వినోదాత్మక చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. జూన్ నెల తొలి వారంలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని. నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ; కధ- మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.
ఈ మధ్య హిట్ పెయిర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'స్వామి రారా' చిత్రంతో హిట్ కొట్టిన నిఖిల్, స్వాతిలతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసారు. ఇటీవల ఇష్క్ చిత్రంతో హిట్ కొట్టిన నితిన్-నిత్యా మీనన్ ఆ వెంటనే నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.