Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
పోలీస్ చేతిలో 36 సార్లు దెబ్బలు తిన్న హీరో నిఖిల్...అప్పుడు సెట్టయ్యాడు!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ త్వరలో 'అర్జున్ సురవరం' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మే 1న ఈ మూవీ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు.
సినిమా ప్రచారంలో భాగంగా నిఖిల్, హీరోయిన్ లావణ్య మీద స్పెషల్ ఓపిసోడ్ చేశారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందలో నిఖిల్ పోలీస్ చేతిలో 36 సార్లు దబ్బలు తిన్నాడట.
స్క్రిప్టు చిన్నదే.. సినిమా పెద్దది
స్క్రిప్టు స్టేజిలో ఉన్నపుడు ఇది చాలా చిన్న సినిమా అనిపించింది. కానీ సెట్స్కు వెళ్లిన తర్వాత పెద్ద సినిమా అయింది. సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం, విభిన్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నామని నిఖిల్ వెల్లడించారు.
పోలీస్ చేతిలో 36 సార్లు దెబ్బలు తిన్న నిఖిల్...అప్పుడు సెట్టయింది!
సినిమాలో పోలీస్ ఆఫీసర్ చేతిలో దెబ్బలు తినే సన్నివేశం ఒకటి ఉందని ఈ సందర్భంగా నిఖిల్ గుర్తు చేసుకున్నారు. ‘ఆఫీసర్ నన్ను చెంపదెబ్బ కొట్టే సన్నివేశాన్ని క్లోజప్ షాట్లో తీద్దామని డైరెక్టర్ భావించారు. ఆయన కొట్టగానే నేను ఫోర్సుగా కిందపడిపోవాలి. ఈ సీన్ చేయడానికి 36 టేక్స్ తీసుకున్నాను. అలా షూటింగులో భాగంగా పోలీస్ చేతిలో 36 సార్లు దెబ్బలు తిన్నట్లు నిఖిల్ తెలిపారు.
లక్కీగా ఆమె చేతిలో ఒక్కసారే
మరో సన్నివేశంలో లావణ్యతో చెంపదెబ్బ తినే సీన్. లక్కీగా ఇది ఒక్క టేక్లో పూర్తయింది అంటూ నిఖిల్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో నిఖిల్, లావణ్య మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయట.
షూటింగ్ ఒక నరకం
‘‘ప్రతి రోజూ షూటింగ్ షెడ్యూల్ 9 నుంచి 6 గంటల వరకు ఉండేది. కానీ సమయానికి ఎప్పుడూ పూర్తయ్యేది కాదు. రాత్రి 10 అయితేగానీ ముగిసేది కాదు.. కొన్ని సార్లు అర్దరాత్రి ఒంటిగంట వరకు షూట్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరం కూడా ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ చేశాం.'' అని నిఖిల్ తెలిపారు.
అర్జున్ సురవరం
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర, నాగినీడు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బి మధు సమర్పణలో ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు.