Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫిట్ నెస్ ట్రైనర్ గా నిఖిల్ ట్వీట్స్
హైదరాబాద్: 'స్వామిరారా' విజయంతో దూసుకుపోతున్న నిఖిల్ తాజాగా ఫిటెనెస్ ట్రైనర్ గా, డైటీషియన్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ట్విట్టర్ లో తన అకౌంట్ లో ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలను అడగమని తన ఫ్యాన్స్ ని కోరాడు. అలాగే తనకు ఫిట్ నెస్ పై చాలా అవగాహన వుందని, అతని అభిమానులకి ట్విట్టర్ ద్వారా కొన్ని సలహాలను ఇచ్చాడు. రీబాక్ సంస్థ ద్వారా ఫిట్ నెస్ ట్రైనర్ గా 2006 లో సర్టిఫికేట్ ఇచ్చిందని తెలిపాడు.
ఇక నిఖిల్, స్వాతి హీరోహీరోయిన్లుగా మాగ్నస్ సినిప్రైమ్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో ' కార్తికేయ' చిత్రం ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. 'స్వామిరారా' చిత్రం విజయం తర్వాత నిఖిల్, స్వాతి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు 'కార్తికేయ'. చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాత.
హీరో నిఖిల్ మాట్లాడుతూ 'స్వామిరారా చిత్రం తర్వాత చాలా సినిమాలే వచ్చాయి. కానీ వాటన్నింటిలో నాకు బాగా స్క్రిప్ట్...కథ నచ్చి చేస్తున్న చిత్రం ఇదే' అన్నారు. నిర్మాత వెంకట శ్రీనివాస్ మాట్లాడుతూ 'కొత్త ప్రయత్నంగా ఈ చిత్రం చేస్తున్నాము. ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయం 'స్వామి రారా'. ఆ సినిమాలో నిఖిల్, స్వాతి జంట యువతరాన్ని విశేషంగా అలరించిందనే చెప్పాలి. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం 'కార్తీకేయ'. నిఖిల్, స్వాతి సహకారంతోనే ఈ చిత్రం మొదలుపెట్టాను. చిత్ర సమర్పకుడు రాజేష్వర్మ నాకు అండగా నిలబడ్డారు' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ -''ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు. ఒకవేళ సమాధానం దొరక్కపోతే... ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే ఓ యువకుని జీవితంలో ఎదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్ర కథ. ఇందులో నిఖిల్, స్వాతి వైద్య విద్యార్థులుగా నటిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశమిది. గుడి నేపథ్యంగా ఈ చిత్రం ఉండబోతోంది'' అని చెప్పారు.
''నిఖిల్ చిత్రాల్లో ఇది హైబడ్జెట్ మూవీ. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని నిర్మాతలు తెలిపారు. తనికెళ్ల భరణి, నాజర్, రావురమేష్, ప్రవీణ్, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్చంద్ర, కూర్పు: కార్తీక శ్రీనివాస్, పాటలు: కృష్ణచైతన్య, కార్యనిర్వాహక నిర్మాత: గునకల మల్లికార్జున్, సమర్పణ: శిరువూరి రాజేష్వర్మ, కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం: చందు మొండేటి.