Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అనుష్క అంకితభావం భేష్.. నిశ్శబ్దం ఓ మైలురాయిగా..
2005 సంవత్సరంలో వచ్చిన 'సూపర్' సినిమాతో ప్రారంభించి నటిగా అనుష్క ప్రయాణానికి 15 సంవత్సరాలు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్ను చిత్ర బృందం గురువారం హైదరాబాద్లోఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు దర్శకులు, నిర్మాతలు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.
డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ, "అనుష్క ఒక నిగ్రహం ఉన్న విగ్రహం. రెండేళ్ల పాటు మాతో పాటు ఈ సినిమా కోసం తను వెచ్చించడం మామూలు విషయం కాదు. అది ఆమె అంకితభావం. మాపై నమ్మకం ఉంచినందుకు ఆమెకు థాంక్స్. ఈ పదిహేనేళ్ల జర్నీలో ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. వాటిలో 'నిశ్శబ్దం' కూడా ఒక మైలురాయి లాంటి సినిమా లాగా నిలబడుతుందని ఆశిస్తున్నా.
అంజలి కూడా ఇప్పటి దాకా చేసిన క్యారెక్టర్లకు చాలా భిన్నమైన క్యారెక్టర్ ఈ సినిమాలో చేసింది. మాకు కావాలసిన అన్నింటినీ నిర్మాత విశ్వప్రసాద్ గారు సమకూర్చి పెట్టారు. ఆయన సపోర్ట్ ఇవ్వబట్టే ఈ సినిమాను నేను అనుకున్నట్లు చేయగలిగాను" అన్నారు.
ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'నిశ్శబ్దం' ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.