Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అనుష్క అంకితభావం భేష్.. నిశ్శబ్దం ఓ మైలురాయిగా..
2005 సంవత్సరంలో వచ్చిన 'సూపర్' సినిమాతో ప్రారంభించి నటిగా అనుష్క ప్రయాణానికి 15 సంవత్సరాలు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్ను చిత్ర బృందం గురువారం హైదరాబాద్లోఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు దర్శకులు, నిర్మాతలు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.
డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ, "అనుష్క ఒక నిగ్రహం ఉన్న విగ్రహం. రెండేళ్ల పాటు మాతో పాటు ఈ సినిమా కోసం తను వెచ్చించడం మామూలు విషయం కాదు. అది ఆమె అంకితభావం. మాపై నమ్మకం ఉంచినందుకు ఆమెకు థాంక్స్. ఈ పదిహేనేళ్ల జర్నీలో ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. వాటిలో 'నిశ్శబ్దం' కూడా ఒక మైలురాయి లాంటి సినిమా లాగా నిలబడుతుందని ఆశిస్తున్నా.
అంజలి కూడా ఇప్పటి దాకా చేసిన క్యారెక్టర్లకు చాలా భిన్నమైన క్యారెక్టర్ ఈ సినిమాలో చేసింది. మాకు కావాలసిన అన్నింటినీ నిర్మాత విశ్వప్రసాద్ గారు సమకూర్చి పెట్టారు. ఆయన సపోర్ట్ ఇవ్వబట్టే ఈ సినిమాను నేను అనుకున్నట్లు చేయగలిగాను" అన్నారు.
ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'నిశ్శబ్దం' ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.