Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘అత్తారింటికి దారేది' కోసం షూటింగ్ కాన్సిల్ చేసుకున్నా
నితిన్ ట్వీట్ లో ... ఖుషీ తర్వాత నేను మొదటి రోజు మార్నింగ్ షో మెయిన్ థియోటర్ లో చూస్తున్న చిత్రం పవర్ స్టార్ అత్తారింటికి దారేది . సంధ్య థియోటర్ లో చూస్తున్నా...సూపర్ ఎక్సైటింగ్ గా ఉంది. పూరీ సార్ ని రిక్వెస్ట్ చేసా..మార్నింగ్ షో కి సినిమాకు వెళ్తానని..ఆయన షూటింగ్ కాన్సిల్ చేసారు..అన్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నైజాం ఏరియాలో నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి గ్లోబల్ సినిమా సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైన నేపథ్యంలో నితిన్ తీవ్రంగా స్పందించారు. పైరసీకి ప్రధాన కారణం ఎడిటర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ అని తెలిసి....నితిన్ షాక్కు గురయ్యాడు. ఎందకంటే నితిన్ నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే'కి కూడా అరుణ్ కుమార్ పని చేసాడు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రానికి కూడ అరుణ్ కుమార్ పని చేస్తున్నాడట.
'ఎడిటర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ అత్తారింటికి దారేది చిత్రాన్ని బయటకు లీక్ చేసాడని తెలిసి నమ్మలేకపోతున్నాను. ఇతడు 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రానికి పని చేసాడు. ఇపుడు 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రానికి కూడా పని చేస్తున్నాడు. ఎంతో షాకయ్యాను. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటి ఆలోచన రావాలంటేనే ఉచ్చ పడిపోవాలి' అంటూ ట్వీట్ చేసాడు.