Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. సావిత్రిగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్ కేక.. ఎన్టీఆర్ బయోపిక్!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో వివిధ ప్రముఖుల పాత్రల్లో నటిస్తున్న నటుల ఫస్ట్ లుక్స్ వరుసగా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య ఒదిగిపోయాడు. రానా, సుమంత్, రకుల్ ప్రీత్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మహానటి సావిత్రి పాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
నిత్యామీనన్ లుక్ కేక
ఒక్క మాటలో చెప్పాలంటే సావిత్రి గెటప్ లో నిత్యామీనన్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ కోసం నిత్యామీనన్ సావిత్రిలా మారిపోయినట్లు కనిపిస్తోంది. కళ్ళతోనే హావభావాలు పలికించగల నటి సావిత్రి. ఆ కితాబు నిత్యామీనన్ కు కూడా ఉంది. దీనితో ఎన్టీఆర్ గా బాలయ్య, సావిత్రిగా నిత్యామీనన్ మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు కన్నుల పండుగే.
చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు
ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ లో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. గుండమ్మ కథ, మాయబజార్, మిస్సమ్మ, నర్తనశాల వంటి అద్భుత చిత్రాల్లో ఎన్టీఆర్, సావిత్రి కలసి నటించారు. ఏఎన్నార్, ఎన్టీఆర్, ఎస్వి రంగారావు వంటి దిగ్గజ నటులకు కూడా సావిత్రి తన నటనతో గట్టి పోటీ నిచ్చేవారు.
నిద్ర లేచింది మహిళా లోకం
తాజాగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్ ఎన్టీఆర్, ఏఎన్నార్ గుండమ్మ కథ చిత్రంలోనిది. ఆ చిత్రంలోని లేచింది మహిళా లోకం అనే సూపర్ హిట్ సాంగ్ కి సంబందించినది ఈ స్టిల్. ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలయ్య పిండి రుబ్బుతుండగా సావిత్రి నిలుచుని చూస్తూ ఉంది.
|
సావిత్రి అమ్మగా నేను
ఈ ఫస్ట్ లుక్ ని నిత్యామీనన్ ట్విట్టర్ లో విడుదల చేసింది. సావిత్రి అమ్మగా నేను నటిస్తుండడం గర్వంగా ఉంది అంటూ నిత్యామీనన్ పేర్కొంది. అటు రాజకీయ నాయకుడిగా అయినా, కథా నాయకుడిగా అయినా బాలయ్య ఎన్టీఆర్ గెటప్ లో అబ్బురపరుస్తున్నాడు.
సంక్రాంతికి కథానాయకుడు
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేయనున్నారు.