Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిత్యా మీనన్ 'సెగ' రగిలేదెప్పుడంటే..
నాని, నిత్యామీనన్ కాంబినేషన్ లో రూపొందిన 'సెగ'చిత్రం విడుదల తేది ఖరారు అయ్యింది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.అలా మొదలైంది కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో రూపిందిన వెప్పం చిత్రానికి రీమేక్.తెలుగు ప్రేక్షకులకు అశోక్ వల్లభనేని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ఆవకాయ బిర్యాని ఫేమే బిందు మాధవి ఓ కీలకపాత్రను పోషించింది. ఈ చిత్రం డైరక్ట్ చేసింది అంజన అనే మహిళా దర్శకురాలు.
దర్శకురాలు ఈ చిత్రం గురించి చెపుతూ..ప్రేమంటే లక్ష్యాన్నీ, భవిష్యత్తునీ నిర్దేశించేది. మా సినిమాలోనూ ఓ ప్రేమ జంట ఉంది. ఆ ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో? చివరి మజిలీ ఏమిటో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటోంది.ఇక నిర్మాత మాట్లాడుతూ..'యువత ఆలోచనలు, ఆశలు ప్రతిబింబించే చిత్రమిది. సినిమా చూస్తున్నంతసేపూ నిజ జీవితాన్ని పరిశీలిస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. నాని, నిత్య జంట మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనేలా నటించిందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి సంగీతం: జోష్వా శ్రీధర్.