Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఖుషి' సినిమాకు కొనసాగింపు
కొంతమంది 'ఖుషి', 'సఖి'లకు కొనసాగింపు అని చెబుతున్నారు. ఈ స్పందన నాలో ఉత్సాహాన్ని నింపిందని నితిన్ అన్నారు. ఆయన తాజా చిత్రం 'ఇష్క్'ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నితిన్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. అలాగే ''సంగీతం, ఫొటోగ్రఫీ, నిత్యమీనన్తో నా కెమిస్ట్రీ... ఈ మూడూ 'ఇష్క్' సినిమాలో బాగా కుదిరాయి. అందుకే ఇంత ఆదరణ పొందుతోంది. థియేటర్లో కూర్చుని సినిమా చూసి... ప్రేక్షకుల స్పందన స్వయంగా తెలుసుకొన్నా. ఇటీవల కాలంలో ఇంత మంచి సినిమా రాలేదని చెబుతున్నారు. సినిమా బాగుంటేనే చూస్తున్నారు.
నచ్చకపోతే రెండో ఆట నుంచే... థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. 'ఇష్క్' వసూళ్లు మాత్రం ఆట ఆటకూ పెరుగుతున్నాయి. 'సై' తరవాత ఇంత స్పందన వచ్చిన చిత్రం ఇదే అన్నారు. నిర్మాత నిర్మాత విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ ''అనుకొన్నదానికంటే మంచి ఫలితం వచ్చింది. అనూప్ స్వరాలు, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం... ప్రేక్షకులకు నచ్చుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అనూప్, మాటల రచయిత రమేష్ సామల కూడా పాల్గొన్నారు. నిత్యమీనన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకుడు.