Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేను గర్వంతో చెప్పుకునే చిత్రం ఇది..హన్సిక
నితిన్, హన్సిక కాంబినేషన్లో రెడీ అవుతున్న సీతారాముల కళ్యాణం..లంకలో చిత్రం జనవరి 19న రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 19న విశాఖపట్టణంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ..కొద్ది రోజుల షూటింగ్ వర్క్ మినహా మొత్తం పూర్తయింది. అలాగే ఈ చిత్రం అవుట్ కమ్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. హీరోయిన్ హన్సిక మరో ముందుడుగు వేసి ఈ చిత్రం చేయటం నాకు గర్వ కారణమంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని వర్ణించింది. ఇక దర్శకుడు ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ..నితిన్ కెరీర్ లో పెద్ద హిట్లు అయిన సై,దిల్,జయం చిత్రాల సరసన ఈ మా చిత్రం నిలుస్తుందని హామీ ఇచ్చాడు. ఈ చిత్రం ముందు నితిన్ వరస ఫ్లాఫ్ లలో ఉన్నారు. ఈ మధ్యే ఇలియానాతో చేసిన రెచ్చిపో చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని పొందింది. ఇక హన్సిక..కళ్యాణ్ రామ్ చిత్రం జయీభవ తర్వాత చేస్తున్న చిత్రం. జయీభవ కూడా ఫెయిల్యూర్ అయింది. దర్శకుడు ఈశ్వరరెడ్డి ఇంతకు ముందు అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రమ్ శీకాకుళం చిత్రం రూపొందించాడు. ఆ చిత్రం బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక నిర్మాతలు కూడా సిద్దు ప్రమ్ శీకాకుళం నిర్మించిన వారే కావటం విశేషం.