Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాబోయే కాలానికి కాబోయే మెగస్టార్ ‘నితిన్’..?
రాష్ట్ర విభజన గొడవలు ముదిరి పాకాన పడ్డ తరుణంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన హీరోల సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని తెలంగాణా వాదులు అల్టిమేటం జారీ చేశారు. చిరంజీవి ఫ్యామిలీ, నందమూరి కుటుంబం, అక్కినేని, ఘట్టమనేని కుటుంబాలన్నీ ఆంధ్ర ప్రాంతానికి చెందినవే. ప్రభాస్, రవితేజ, గోపిచంద్ సహా యువ హీరోలంతా అటు నుంచి వచ్చినవారే. ఇక నైజాంలో వీళ్ల సినిమాలు జామ్ అని ఇక్కడి వారు గట్టిగా అంటోంటే మరి వీరు ఎవరి సినిమాలు చూస్తారట? అనే ప్రశ్న పుట్టక మానదు.
వెంటనే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చే తెలంగాణా హీరో నితిన్ ఒక్కడే! ఒక వేళ నిజంగానే నైజాం జనం సీడెడ్, ఆంధ్ర ప్రాంత హీరోలని బ్యాన్ చేశారే అనుకుందాం. అప్పుడిక నైజాంకి నితిన్ ఏక్ నిరంజన్ అయిపోతాడేమో? అయినా పిచ్చి కాకపోతే అరవోడు నటించిన సినిమాల్ని కూడా గుడ్డలు చించుకుని చూసేసే వెర్రి జనానికి, సాటి తెలుగోడు పగవాడైపోయాడా? కలిసుందాం బాబూ అని మంచి మాటలు చెబుతుంటే పిచ్చేక్కుతోందా? పిచ్చితనానికి పరాకాష్ట అంటే సినీ పరిశ్రమని టార్గెట్ చేయడం కాదూ!!