Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నితిన్ మళ్లీ మరో చావు దెబ్బ కొట్టనున్నాడా?
వరస ఫ్లాపుల హీరో నితిన్ మరోసారి చావు దెబ్బకొట్టనున్నాడా అని అతని లేటెస్ట్ చిత్రం రిలీజ్ గురించి చర్చ జరుగుతోంది. దాదాపు మూడేళ్ళ క్రితం ప్రారంభమై రకరకాల కారణాలతో ఆగిపోయి..మళ్ళీ ఇంత కాలానికి బూజు వదిలించుకుని బయిటకు వస్తున్న మారో చిత్రం గురించి ఈ కామెంట్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఇలియానాతో కలిసి రెచ్చిపో..అంటూ ప్రేక్షకుల సహనంపై రెచ్చిపోయి నాట్యమాడిన నితిన్ ఈ చిత్రంతో ఏం చేయనున్నాడో అంటున్నారు. అప్పట్లో సిద్దిక్ అనే ప్రముఖ మళయాళ దర్శకుడు తెలుగులో ఎంట్రీ ఇస్తూ ఈ చిత్రం రూపొందించాడు. అయితే హీరోయిన్ మీరా చోప్రా కేసు వేయటంతో ఈ చిత్రం ఆగిపోయింది. చివరకు రాజీ కొచ్చి ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.ఇక ఈ చిత్రానికి మొదట సత్యం..శివం..సుందరం..అనే పేరు పెట్టారు. ఇప్పుడు మారో అని పెట్టి రిలీజ్ చేస్తున్నారు. వయెలెంట్ బట్ సైలెంట్ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకుందిఈ సందర్భంగా నిర్మాతలు మామిడాల శ్రీనివాస్, సాగర్ మీడియాతో మాట్లాడారు.
"నితిన్ ఈ చిత్రంలో టైలర్మేడ్ పాత్రను పోషిస్తున్నారు. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్, వినోదం, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు అన్నీ సమపాళ్లలో కుదిరాయి. మైండ్గేమ్ ప్రధానంగా కథ కొనసాగుతుంది. నితిన్ ఈ చిత్రంలో ఐ.ఐ.టి విద్యార్థిగా కనిపిస్తాడు. తన జీవితంలో ఎదురైన సమస్యలను భుజ బలంతో కాకుండా బుద్ధి బలంతో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్ర కథాంశం. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. డిసెంబర్లో ఆడియోను, అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ- "మలయాళంలో తొమ్మిది, తమిళంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన నేను తెలుగులో రూపొందిస్తున్న తొలి చిత్రం ఇది. చిత్ర కథ, కథనాలు వాస్తవానికి దగ్గరగా వుంటాయి. మణిశర్మ స్వరపరచిన బాణీలు అందర్నీ ఆకట్టుకుంటాయి' అన్నారు. కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్, రఘు బాబు, రాజ్యలకి, నరసింహారాజు, రమాప్రభ, అబ్బాస్, చలపతిరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: మణిశర్మ, కెమెరా: జయరామ్, ఎడిటింగ్: టి.ఆర్.శేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డి.శైలేందర్, సహనిర్మాత: ఎస్. అనిల్కుమార్.