Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
రాష్ట్ర విభజన వల్లే నితిన్ సినిమా ఆపాం: నందినీరెడ్డి
హైదరాబాద్: 'అలా మొదలైంది' దర్శకురాలు నందినీరెడ్డి, యంగ్ హీరో నితిన్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఆగి పోయినట్లు దర్శకురాలు నందినీరెడ్డి ప్రకటించారు. దీనికి ఆమె చెబుతున్న కారణం రాష్ట్రం రెండుగా విడిపోవడమే అంటున్నారు. విభజన వల్ల టాక్స్ సమస్యలు తలెత్తుతాయనే సినిమా ఆపినట్లు ఆమె తెలిపారు.
ఈ మేరుక ఆమె ఒక స్టేట్మెంట్. 'హీరో నితిన్తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అంతా ఫైనలైజ్ అయింది. అయితే రాష్ట్ర విభజన కారణంగా ఈ సినిమాను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా మొదలు పెడితే అనేక టాక్స్ సమస్యలు వస్తాయని అర్థమైంది. అందుకే మేము చాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఆ సమస్యలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఆలోచిస్తాం' అన్నారు.
నితిన్ నటించిన 'హార్ట్ ఎటాక్' చిత్రం విడుదలకు ఒక రోజు ముందు నితిన్-నందినీ రెడ్డి ప్రాజెక్టును లాంచనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా....దర్శకురాలు నందినీ రెడ్డి త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో హిట్టయిన 'అలా మొదలైంది' చిత్రాన్ని ఆమె హిందీలో రీమేక్ చేయబోతున్నారు.
బాలీవుడ్ ఎంట్రీపై దర్శకులురాలు నందినీ రెడ్డిని మీడియా వారు ప్రశ్నించగా 'అలా మొదలైంది' చిత్రం హిందీలో రీమేక్ చేస్తున్న విషయం వాస్తవమే అన్నారు. అయితే పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పేందుకు ఆమె ఇష్ట పడటం లేదు. ఓ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడే ఏవిషయాన్ని నేను బయటకు చెప్పదలుచుకోలేదు అన్నారు.