Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వైజాగ్ లో అయితే విజయం గ్యారెంటీ: నితిన్
"విశాఖలో షూటింగ్ జరుపుకున్న చిత్రాలు తప్పకుండా విజయం సాధిస్తాయనేది సెంటిమెంట్. ఈ 'సీతారాముల కళ్యాణం' (లంకలో) చిత్రం కూడా ఇక్కడే షూటింగ్ జరుపుకొని.. ఇక్కడే ఆడియో ఫంక్షన్ కూడా జరుపుకోవటం ఆనందంగా వుంది...అన్నారు నితిన్. నితిన్,హన్సికల కాంబినేషన్లో రెడి అయిన 'సీతారాముల కళ్యాణం' (లంకలో) ఆడియో పంక్షన్ వైజాగ్ లో జరిగింది. చిత్రం ఆడియో సీడీని మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు ఆవిష్కరించి విశాఖ కలెక్టర్ జె.శ్యామలరావుకు అందజేశారు. కేసెట్ని విశాఖ పోలీస్ కమిషనర్ ఎన్.సాంబశివరావు విడుదల చేయగా, పారిశ్రామిక వేత్త కంకటాల మల్లిక్ అందుకున్నారు.ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ పై విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మంచి ట్యూన్స్ అందించాడు అంటూ మెచ్చుకున్నాడు. ఇక నిర్మాత విజయప్రసాద్ మాట్లాడుతూ "ఓ సూపర్హిట్ చిత్రానికి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వున్నాయి. 'సిద్ధు ఫ్రం సికాకుళం' సినిమా తర్వాత దర్శకుడు ఈశ్వర్ ఓ సంవత్సరం కష్టపడి ఈకథను తయారుచేశాడు' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ దర్శకత్వంలో శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ నిర్మిస్తున్నారు.