Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వైజాగ్ లో అయితే విజయం గ్యారెంటీ: నితిన్
"విశాఖలో షూటింగ్ జరుపుకున్న చిత్రాలు తప్పకుండా విజయం సాధిస్తాయనేది సెంటిమెంట్. ఈ 'సీతారాముల కళ్యాణం' (లంకలో) చిత్రం కూడా ఇక్కడే షూటింగ్ జరుపుకొని.. ఇక్కడే ఆడియో ఫంక్షన్ కూడా జరుపుకోవటం ఆనందంగా వుంది...అన్నారు నితిన్. నితిన్,హన్సికల కాంబినేషన్లో రెడి అయిన 'సీతారాముల కళ్యాణం' (లంకలో) ఆడియో పంక్షన్ వైజాగ్ లో జరిగింది. చిత్రం ఆడియో సీడీని మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు ఆవిష్కరించి విశాఖ కలెక్టర్ జె.శ్యామలరావుకు అందజేశారు. కేసెట్ని విశాఖ పోలీస్ కమిషనర్ ఎన్.సాంబశివరావు విడుదల చేయగా, పారిశ్రామిక వేత్త కంకటాల మల్లిక్ అందుకున్నారు.ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ పై విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మంచి ట్యూన్స్ అందించాడు అంటూ మెచ్చుకున్నాడు. ఇక నిర్మాత విజయప్రసాద్ మాట్లాడుతూ "ఓ సూపర్హిట్ చిత్రానికి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వున్నాయి. 'సిద్ధు ఫ్రం సికాకుళం' సినిమా తర్వాత దర్శకుడు ఈశ్వర్ ఓ సంవత్సరం కష్టపడి ఈకథను తయారుచేశాడు' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ దర్శకత్వంలో శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ నిర్మిస్తున్నారు.