twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూమర్స్ కి చెక్ చెప్పటానికే నితిన్ ట్వీట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : నితిన్ నానుస్తున్నాడు...ఏ కథను ఓకే చెయ్యకుండా...డైరక్టర్స్ తో ఆడుకుంటున్నాడు అంటూ మీడియాలో రూమర్స్ గుప్పు మంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నితిన్ వీటికి చెక్ చెప్పాలనుకుంటునట్లున్నాడు. వెంటనే తన తదుపరి చిత్రం ఇదీ అని ప్రకటించేసాడు. ట్విట్టర్ లో తను చేయబోయే చిత్రం వివరాలు ప్రకటించాడు.

    నితిన్ ట్వీట్ లో... ." నా తదుపరి చిత్రం దర్శకుడు కరుణాకరన్ తో చేయబోతున్నాను, శ్రేష్ట్ మూవీస్ లోనే చేస్తున్నా... మిష్తి(సుభాష్ గై కాంచి ఫేమ్) ని హీరోయిన్ గా తీసుకున్నాం. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు .." అంటూ తేల్చి చెప్పాడు. అంటే మారుతి తో చిత్రం లేదనే ఖరారు చేయటానికే ఈ ట్వీట్ చేసాడన్నమాట.

     Nitin tweet about his next movie

    మరో ప్రక్క నితిన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ఫోటాన్‌ కథాస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పెై తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌' చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రేమ్‌సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం 'తమిళ సెల్వనుం తనియార అంజలుం' పేరుతో ఈ చిత్రం రూపొందబోతోంది. నిర్మాత గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో లవ్‌, యాక్షన్‌, కామెడీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. సింగర్‌ కార్తీక్‌ ఈ చిత్రానికి మంచి సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    Nithiin tweeted..." My next film is with dir KARUNAKARAN sir under SRESHTH movies..heroine is MISHTHI(subash ghai's kanchi fame)n music by ANUP RUBENS.."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X