Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
స్టార్ హీరోలతో చెయ్యాలని లేదని తేల్చి చెప్పింది
నిత్యామీనన్ మాట్లాడుతూ.. 'ఏమిటో ఈ మాయ' చిత్రీకరణ పూర్తయింది. విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. శ్రీప్రియ దర్శకత్వంలోని '2 ఫిమేల్ కోట్టయం' అనే మలయాళ రీమేక్లో నటిస్తున్నా. అల్లరి అమ్మాయి పాత్రలే పోషిస్తున్నారేంటని అడుగుతున్నారు. ప్రతి హీరోయిన్ అలాంటివే ఇష్టపడుతోంది. ఆ పేరు నుంచి బయటపడాలని భిన్నమైనవి ఎంచుకోవాలనుకుంటున్నా..అంది.
అలాగే హీరోయిన్ కి కీలకంగా ఉండే కథల్ని ఎంపిక చేసుకుంటున్నా. 'అలా మొదలైంది'లో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇటీవల 'అప్పా' అనే చిత్రంలో మేకప్ లేకుండా నటించా. అగ్రస్థానానికి ఎదగాలంటే పెద్ద హీరోల సరసన నటిస్తేనే సాధ్యమవుతుందనుకోవడం నిజం కాదు. మనం ప్రదర్శించే నటనే పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తుందని అభిప్రాయపడింది.
తెలుగులో అందుకున్న విజయాల్లాంటివి తమిళంలో రాలేదనే బెంగతో ఉంది నటి నిత్యమీనన్. 'సెగ', '180' చిత్రాలు నిరాశ పరచటంతో ఆవేదన చెందుతోంది. అయినా 'ఏమిటో ఈ మాయ' చిత్రంతో అక్కడా నిలదొక్కుకుంటాననే నమ్మకం వ్యక్తం చేస్తోంది.
చేరన్ దర్శకుడిగా తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. శర్వానంద్, నిత్యమీనన్ జంటగా నటించారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
వృత్తి, ఉద్యోగ జీవితం.. అంటూ నేటి యువత ఉరుకులు.. పరుగులు పెడుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు దూరంగా పరిగెడుతున్న వారు ఏం కోల్పోతున్నారో మా చిత్రంలో చూపిస్తున్నామంటున్నారు చేరన్.