Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
స్టార్ హీరోలతో చెయ్యాలని లేదని తేల్చి చెప్పింది
నిత్యామీనన్ మాట్లాడుతూ.. 'ఏమిటో ఈ మాయ' చిత్రీకరణ పూర్తయింది. విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. శ్రీప్రియ దర్శకత్వంలోని '2 ఫిమేల్ కోట్టయం' అనే మలయాళ రీమేక్లో నటిస్తున్నా. అల్లరి అమ్మాయి పాత్రలే పోషిస్తున్నారేంటని అడుగుతున్నారు. ప్రతి హీరోయిన్ అలాంటివే ఇష్టపడుతోంది. ఆ పేరు నుంచి బయటపడాలని భిన్నమైనవి ఎంచుకోవాలనుకుంటున్నా..అంది.
అలాగే హీరోయిన్ కి కీలకంగా ఉండే కథల్ని ఎంపిక చేసుకుంటున్నా. 'అలా మొదలైంది'లో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇటీవల 'అప్పా' అనే చిత్రంలో మేకప్ లేకుండా నటించా. అగ్రస్థానానికి ఎదగాలంటే పెద్ద హీరోల సరసన నటిస్తేనే సాధ్యమవుతుందనుకోవడం నిజం కాదు. మనం ప్రదర్శించే నటనే పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తుందని అభిప్రాయపడింది.
తెలుగులో అందుకున్న విజయాల్లాంటివి తమిళంలో రాలేదనే బెంగతో ఉంది నటి నిత్యమీనన్. 'సెగ', '180' చిత్రాలు నిరాశ పరచటంతో ఆవేదన చెందుతోంది. అయినా 'ఏమిటో ఈ మాయ' చిత్రంతో అక్కడా నిలదొక్కుకుంటాననే నమ్మకం వ్యక్తం చేస్తోంది.
చేరన్ దర్శకుడిగా తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. శర్వానంద్, నిత్యమీనన్ జంటగా నటించారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
వృత్తి, ఉద్యోగ జీవితం.. అంటూ నేటి యువత ఉరుకులు.. పరుగులు పెడుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు దూరంగా పరిగెడుతున్న వారు ఏం కోల్పోతున్నారో మా చిత్రంలో చూపిస్తున్నామంటున్నారు చేరన్.