Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చీరలో అందాన్ని చుట్టింది: నివేదా థామస్ ఫొటోలు చూసారా?
‘జెంటిల్ మన్'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి హిట్ను తన ఖాతాలో వేసుకున్న నివేదా థామస్ ఆ తరువాత నిన్నుకోరి, జై లవకుశ సినిమాల్లోనూ నటించే చాన్స్ కొట్టేసి హ్యాట్రిక్ హిట్స్ సాధించింది.
'జెంటిల్ మన్'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి హిట్ను తన ఖాతాలో వేసుకున్న నివేదా థామస్ ఆ తరువాత నిన్నుకోరి, జై లవకుశ సినిమాల్లోనూ నటించే చాన్స్ కొట్టేసి హ్యాట్రిక్ హిట్స్ సాధించింది. నివేదా థామస్..టాలీవుడ్ లో ఈమె నటించిన పలు చిత్రాలు వరుసగా విజయవంతమౌతున్నాయి. దీనితో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఆమె నటించిన మూడు చిత్రాలు వరుస హిట్లు కొట్తటం తో ఆనందంతో మురిసిపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'జై లవ కుశ' మంచి విజయంతో ముందుకు దూసుకెళుతోంది.
నివేదా థామస్
‘జెంటిల్ మెన్' చిత్రంతో ఈ మలయాళి భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ‘జెంటిల్ మెన్' లో 'నాని' సరసన 'నివేదా' నటించింది. అనంతరం మరోసారి ఇదే జంటగా 'నిన్ను కోరి' సినిమా వచ్చింది. ఈ చిత్రం కూడా హిట్ టాక్ ను అందుకుంది. అనంతరం 'ఎన్టీఆర్' హీరోగా 'బాబీ' దర్శకత్వంలో 'నందమూరి కళ్యాణ్ రామ్' నిర్మాణంలో వచ్చిన 'జై లవ కుశ' సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.
ట్విటర్లో లేఖ రాసింది
ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా అద్బుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడుని ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ జైలవకుశ హిట్ పై అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ.. ఓ పది రోజుల కింద ట్విటర్లో ఓ లేఖ రాసి పోస్ట్ చేసింది.
ఆశీర్వాదంగా భావిస్తున్నా
‘ఒక్క సినిమా హిట్ అవడమే స్పెషల్. అలాంటిది నటించిన మొదటి 3 సినిమాలనూ ఇంత బాగా ఆదరించి, తెలుగు సినీ ఇండస్ట్రీ నన్ను మా అమ్మాయి అని సొంత మనిషిలా చూడటం.. దీనికంటే పెద్ద కాంప్లిమెంట్ ఏమీ ఉండదు. దీన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నా..' అంటూ నివేదా తనదైన తెలుగులో రాసుకొచ్చింది.
అభిమానులు కుటుంబ సభ్యులు అయిపోయారు
‘నా అభిమానులు ఇప్పుడు నా కుటుంబ సభ్యులు అయిపోయారు. మీకు ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. జై లవకుశను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు. మరో అందమైన చిత్రంలో.. మంచి పాత్రతో మిమ్మల్ని కలుస్తా.. ప్రేమతో మీ నివేదా థామస్' అంటూ నివేదా తన లేఖను ముగించింది.. తనను తమ అమ్మాయే అని తెలుగువారు అంటున్నారని ఇటీవలే మురిసిపోతూ ఓ ట్వీట్ చేసింది.
శారీస్ స్పీక్
ఇక తెలుగు ప్రేక్షకులకి గిఫ్ట్ గా ఇంకో సర్ప్రైజ్ ఇచ్చింది. చక్కని చీర కట్టుకుని, ముస్తాబై, చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగింది. వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేసి సంబరపడిపోయింది. 'శారీస్ స్పీక్..' అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి.