Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మానవ మృగాలను దహించే దిశగా నివురు: అల్లం నారాయణ
హైదరాబాద్: మానవ మృగాలను దహించే దిశగా నివురు సినిమా రావడం, సమాజానికి ఎంతో కొంత మంచి జరుగుతుందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చెర్మన్ అల్లం నారాయణ అన్నారు. సోమాజీగుడా ప్రెస్ క్లబ్లో ఇటీవల జరిగిన నివురు సినిమా లోగో, పోస్టర్ ఆవిష్కణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ - సినిమా అంటే కేవలం అందచందాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. సామాజిక అంశాలను కథావస్తువులుగా ఎన్నుకుని మార్పునకు నాదిం పలకాలని ఆయన సూచించారు.
ఆ తర్వాత పివోడబ్ల్యు సంధ్య మాట్లాడారు. సమాజంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మనవ మృగాలకు శిక్షలు పడాల్సిందేనని అన్నారు. ఈ నివురు సినిమా తప్పకుండా విజయం సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రదర్శకులు రుషీ కృష్ణ, హీరో మహేష్ నీలు, నిర్మాత అభిరామ్, సహ నిర్మాత సోమే,్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేరణ్, నటులు రోషం బాలు, క్రిష్, సంగీత దర్శకుడు ఎంఎల్ రాజు, రచయిత అభి ఉప్పల, సంపత్, మధు, సాగర్, రాజు, శ్రీకాంత్, గిరీ తదితరులు పాల్గొన్నారు.