Don't Miss!
- Technology 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- News ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నెం.1 స్థానంలో రామ్ చరణ్ ‘నాయక్’
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం వసూళ్ల పరంగా, లాభాలపరంగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో విడుదలైన సినిమాల్లో నెం.1 స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో మహేష్ బాబు-వెంకీ మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మూడో స్థానంలో ప్రభాస్ మిర్చి చిత్రాలు నిలిచాయి. ఇండో ఏషియన్ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడింది. తొలి త్రైమాసికంలో ఇప్పటి వరకు విడులైన చిత్రాల్లో నాయక్ తో పాటు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చి, స్వామి రారా చిత్రాలు మాత్రమే హిట్ అయి పెట్టుబడిని మించిన వసూళ్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయి అని సదరు వార్తా సంస్థ తేల్చింది.
రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'నాయక్' చిత్రం రూ. 35 కోట్ల బడ్జెట్తో నిర్మాణమై రూ. 60 కోట్ల షేర్ వసూలు చేసినట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా చేసింది. డివివి దానయ్య నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.
మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూ. 50 కోట్ల షేర్ సాధించినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఈ చిత్రం దాదాపు రూ. 45 కోట్లతో నిర్మించారు. ఈచిత్రంలో వెంకటేష్ సరసన అంజలి, మహేష్ బాబు సరసన సమంత నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.
ఇక ప్రభాస్ హీరోగా రూపొందిన 'మిర్చి ' చిత్రం రూ. 30 కోట్ల బడ్జెట్ తో రూపొంది రూ. 45 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ బేనర్ పై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈచిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.