Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
షాకింగ్ న్యూస్-ఆడియో వేడుకకు నో చెప్పిన పవన్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్. పవన్ తాజాగా నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఆడియో వేడుక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వారందరికీ ఇది చేదు వార్తే. ఎందుకంటే ఆడియో వేడుక రద్దయింది. ఎలాంటి వేడుక నిర్వహించకుండానే నేరుగా ఆడియోను ఈ నెల 24న మార్కెట్లోకి విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
హీరో పవన్ కళ్యాణ్ ఆడియో వేడుక నిర్వహించడానికి విముఖత చూపడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే పవర్ స్టార్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉందని, అభిమానులు ఇబ్బంది పడకూడదనే ఒక మంచి ఉద్దేశ్యంతోనే పవర్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
పవన్ కళ్యాణ్కి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనకు సంబంధించిన ఏ వేడుక జరిగిన తండోపతండాలుగా అభిమానులు తరలి వస్తుంటారు. పంజా, గబ్బర్ సింగ్ ఆడియో వేడుకల సందర్భంగా భారీగా అభిమానులు తరలి రావడంతో చోటు సరిపోక చాలా మంది బయటే ఉండి పోయారు. క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ట్రాఫిక్ జామ్తో అనేక మంది ఇబ్బంది పడ్డారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకూడదని, తన వల్ల, తన సినిమా వల్ల ఇంత మంది ఇబ్బంది పడటం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు నో చెప్పినట్లు తెలస్తోంది. పాటలు, సినిమా బాగుంటే హిట్టవుతుంది...అడియో వేడుకలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పవర్ స్టార్ భావిస్తున్నారట.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో పవన్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈచిత్రంలో పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.