Don't Miss!
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆడియో వేడుక లేకుండానే నాగ్‘రాజన్న’ పాటలు
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా సినిమా 'రాజన్న" సినిమాకు ఆడియో వేడుక నిర్వహించకూడదని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఎలాంటి వేడుక లేకుండానే ఈ సినిమా పాటలు నవంబర్ 26 నుంచి మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా దర్వకత్వం వహించారు. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలకు స్వయంగా రాజమౌళి దర్వకత్వం వహించారు. నాగార్జున ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. నిజాం పాలనకు, రజకార్ల ఆగడాలను వ్యతిరేకంగా సాగిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.
రాజన్న సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తియింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 23న భారీ ఎత్తున రాజన్న సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్ పీపుల్ ను ఆకట్టుకునే కథాంశంతో ఉన్న ఈ సినిమా తన కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నాగార్జున ఆశిస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున ఢమరుకం షూటింగులో బిజీగా ఉన్నారు.