Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ ‘AD’ ఆడియో, ఫ్యాన్స్కి షాకిచ్చే నిర్ణయం!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రం ఆడియో జులై 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు.
అయితే
పవన్
కళ్యాణ్
సన్నిహిత
వర్గాల
నుంచి
అందుతున్న
సమాచారం
ప్రకారం.....పవన్
కళ్యాణ్
మరోసారి
అభిమానులకు
షాకిచ్చే
నిర్ణయం
తీసుకుంటున్నారని
తెలుస్తోంది.
పవన్
గత
సినిమా
'కెమెరామెన్
గంగతో
రాంబాబు'
ఆడియో
ఎలాంటి
ఫంక్షన్
లేకుండా
డైరెక్టుగా
విడుదల
చేసిన
సంగతి
తెలిసిందే.
తాజాగా
'అత్తారింటికి
దారేది'
చిత్రం
ఆడియో
కూడా
అదే
విధంగా
డైరెక్టుగా
మార్కెట్లోకి
విడుదల
చేయాలని
పవన్
కళ్యాణ్
నిర్ణయించుకున్నట్లు
తెలుస్తోంది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఏకీభవించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే......అభిమానులకు ఆడియో వేడుక ముచ్చట తీరడం కష్టమే అని స్పష్టం అవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ నిమిత్తం నెలరోజుల క్రితం యూరప్ వెళ్లిన పవన్ షెడ్యూల్ ముగియడంతో హైదరాబాద్ తిరిగి వచ్చారు. యూరప్ షెడ్యూల్లో పాటల చిత్రీకరణతో పాటు, కొన్ని సీన్స్ షూట్ చేసారు. స్పెయిన్లోని ఐస్లాండ్లో పవన్ కళ్యాణ్, వంశీ(ఒక విచిత్రం హీరో)లపై ప్రత్యేకమైన ఫైట్ సీన్ చిత్రీకరించారు. ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా చాపర్లను వాడారు. ఈ ఫైట్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు.
స్పెయిన్లోని మిలన్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన యూనిట్ సభ్యులు మంగళవారం తెల్లవారు ఝామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. జులై 4వ తేదీ నుంచి నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అన్పపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో పవన్ కళ్యాణ్, సమంత మరికొందరితో కలిపి పాటను చిత్రీకరించబోతున్నారు.
ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.