Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గోవా ఫెస్టివల్ లో తెలుగు సినిమాల పరిస్దితి
హైదరాబాద్ : గోవాలో 43వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలవుతోంది. ఆ వేడుకలో ఉన్న ఇండియన్ పనోరమా విభాగానికి ఒక్క తెలుగు సినిమా ఎంపిక కాకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచి,జాతీయ స్ధాయిలో చర్చగా మారింది.మన దగ్గర ఏటా వందకి పైగా చిత్రాలు వస్తాయి. అయితే పనోరమాకి ఎంట్రీలుగా వెళ్లినవి కేవలం తొమ్మిది మాత్రమే. అందులో నాలుగు చిత్రాలు ఇంకా విడుదల కూడా కానివే. చిత్రాల ఎంపికకు రెండు దశలుంటాయి. తొమ్మిది మంది సభ్యులు మూడు కమిటీలుగా విడిపోతారు. వీళ్లు తమ ముందుకు వచ్చిన చిత్రాల నుంచి ఉత్తమమైనవాటిని ఎంపిక చేస్తారు. ఇది ప్రాథమిక దశ. మూడు కమిటీల నుంచీ వచ్చినవాటిని అందరూ కలిసి వీక్షిస్తారు. వాటి నుంచి కొన్నింటిని వడబోసి మేలైన వాటిని తీసుకువస్తారు. ప్రాథమిక స్థాయిలో మన సినిమాలన్నీ తిరస్కారానికి గురయ్యాయి.
కమిటీ ముందుకు వెళ్లినవాటిలో 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ', 'మల్లెల తీరం', 'మా ఊరి జోగిని' లాంటివి ఉన్నాయి. బాక్సాఫీసు దగ్గర విజయవంతమై... సాంకేతికపరమైన హంగులతో ఆశ్చర్యపరచిన 'ఈగ' సినిమా అసలు ఎంట్రీగానే వెళ్లలేదు. 'అంత పెద్ద చిత్రసీమ నుంచి ఒక్క సినిమా కూడా లేకపోతే బాగోదు ఏదైనా మంచి చిత్రం ఉంటే చూడండి' అని న్యాయనిర్ణేతలే చొరవ తీసుకొని వెదికారు. దొరకని పరిస్థితి నెలకొని ఉంది. అయినా ఫలితం లేదు.
43వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమాకి భారతీయ భాషా చిత్రాల్ని ఎంపిక చేసేందుకు తొమ్మిది మందితో ఓ కమిటీ ఏర్పాటైంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు బుద్ధదేవ్ దాస్ గుప్తా ఆ కమిటీకి సారథి. వారి ముందుకు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ, తెలుగు, కొంకణీ... ఇలా అన్ని భాషల నుంచీ చిత్రాలొచ్చాయి. అంతిమంగా చిత్రాల్ని ఎంపిక చేసేటప్పుడు- న్యాయనిర్ణేతలు ఒక్క తెలుగు సినిమా కూడా లేదే అన్న విషయాన్ని గ్రహించారు. వచ్చిన వాటిలో ఒక్కటైనా నిబంధనలకు అనువుగా ఉంటే ఎంపిక చేద్దామని ప్రయత్నిస్తే ఏ సినిమా నిలబడలేదు.
మూడంకెల సంఖ్యలో చిత్రాలను ఉత్పత్తి చేసే రంగం నుంచి కేవలం తొమ్మిది చిత్రాలు పోటీకి వెళ్లడం శోచనీయం. మలయాళంలో ఏటా అరవై డెబ్భై చిత్రాలు వస్తున్నాయి. పనోరమాకి 32 సినిమాలు 'ఎంట్రీ'లుగా వెళ్లాయి. అయిదు ఎంపికయ్యాయి. బెంగాలీ నుంచి ఇరవై సినిమాలను పంపించారు. మూడు ప్రదర్శితం కాబోతున్నాయి. కొంకణీలో ఏటా మూడునాలుగు చిత్రాలొస్తాయి. ఆ భాష నుంచీ ఓ సినిమా పనోరమాకి ఎంపికైంది. భోజ్పురి భాషనుంచీ సృజనాత్మక చిత్రం ఒకటి రావడంతో దాన్ని పనోరమాకి ఎంపిక చేశారు.