Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా కాంపౌడ్ నుండి రాకపోతేయే నందమూరివి వచ్చాయిగా...!?
అల్లు శిరీష్ కోలీవుడ్ లో హీరోగా పరిచయం కానున్న విషయం తెలిసిందే. తెలుగులో నాగచైతన్య హీరోగా రూపొందిన '100% లవ్" చిత్రం తమిళ రీమేక్ లో అల్లు శిరీష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం సౌత్ స్కోప్ మ్యాగజైన్ ను నిర్వహిస్తోన్న అల్లు శిరీష్ ఇక పై ఫుల్ ప్లెడ్జ్ నిర్మాతగా, యాక్టర్ గా కొనసాగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అల్లు అరవింద్ కూడా శిరీష్ ని హీరోగా పరిచయం చేయడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.
కాగా రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన 'బద్రినాథ్" హిట్ చిత్రమని కలెక్షన్లు బాగా కురిపించిందని డబ్బాలు కొట్టుకుంది అల్లు కాంపౌండ్. కానీ ఇటీవల అల్లు శిరీష్ ఓ విషయం బయటపెట్టాడు. 2010,2011 టాలీవుడ్ కి కలిసిరాలేదని, కమర్షియల్ సక్సెస్ లు రాలేదని అన్నాడు. దీంతో అల్లు శిరీష్ పై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయిగానీ ..'అదుర్స్", సింహా", బృందావనం" చిత్రాలు భారీగా వసూళ్ళు చేసాయని, ఈ మాట చెప్పడం ఇష్టంలేక అల్లు శిరీష్ ఇలా చెప్పాడని అంటున్నారు. తమ సినిమాలు ప్లాప్ అయ్యాయి అని చెప్పకుండా, చీప్ గా ఇలాంటి మాటలు మాట్లాడి తన బుద్దిని మరోసారి బయట పెట్టుకున్నాడని కూడా శిరీష్ ని దుమ్మెత్తిపోస్తున్నారు...