Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నిర్మాత కూడా 'కొమురం పులి' ప్లాఫ్ అని ఫిక్సయ్యే...
పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన పులి చిత్రం గత వారం రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా నిర్మాతలు మాత్రం సాధారణంగా ప్రమోషన్ మాత్రం ఆపరు. అయితే నిర్మాత శింగనమల రమేష్ మాత్రం ఈ చిత్రంపై ఇక పైసా పెట్టడం కూడా అనవసరం అని ఫిక్సయినట్లున్నారు. అందుకు తగినట్లే ప్రమోషన్ ఆపుచేసేసారు. ఈ చిత్రం ప్రమేషన్ లో పాల్గొనటానికి హీరో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు. విషయం ముందే తెలిసినట్లుగా ఆయన తన తదుపరి చిత్రం జీసస్ క్రీస్ట్ షూటింగ్ లో పాల్గొనటానికి జెరూసలెం వెళ్ళిపోయారు. ఇక హీరోయిన్ నిఖిషా పటేల్..హైదరాబాద్ లో ఉన్నా ఉపయోగం లేదు. ఆమెకు తెలుగు రాదు. ఆమెకి పాపులారిటీ లేదు. ఇక దర్శకుడు ఎస్.జె.సూర్య మాత్రం బాగుండదనుకున్నాడో ఏమో గానీ ఓ ప్రెస్ మీట్ ఎరేంజ్ చేసి కొమురం పులి..అధ్బుతం మిస్సవద్దు అని తేల్చి చెప్పేసాడు. మరో ప్రక్క నిర్మాత శింగనమల రమేష్..ఈ సినిమా తనది కాదన్నట్లుగా తన తదుపరి చిత్రం ఖలేజా హడావిడిలో పడిపోయారు. కొత్త పోస్టర్స్ గానీ, ట్రైలర్స్ గానీ వేసే ఆలోచనలో లేరని చెప్తున్నారు. అంటే ఇక ఈ ఫ్లాప్ కి పెట్టుబడి వేస్టు అని నిర్ణయించుకున్నట్లేగా...అదీ సంగతి.