Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అవన్నీ రూమర్స్...రాజమౌళి
మగధీర చిత్రం పై వినపడుతున్న బయిట వస్తున్న రకరకాల రూమర్స్ ను ఖండిస్తూ దర్శకుడు రాజమౌళి క్లారిటీగా సమాధానం ఇచ్చారు. ఈ రోజు(శుక్రవారం)ప్రసాద్ ల్యాబ్ లో మగధీరకు స్పెషల్ ఎఫెక్టులు, సి.జి వర్క్ అందించిన EFX వారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. బయిట మగధీరను హిందీలోకి రీమేక్ చేస్తున్నారని, సీక్వెల్ తీస్తున్నారని వినపడుతోంది. దానికి మీరేమంటారు అన్న దానికి సమాధానంగా రాజమౌళి అవన్నీ రూమర్స్ అని కొట్టి పాడేసారు. నేను స్పష్టంగా చెప్తున్నాను.నిర్మాత అల్లు అరవింద్ నన్ను హిందీ రీమేక్ చేయమని అడిగిన మాట వాస్తవం. కానీ నేను ఒప్పుకోలేదు. కాబట్టి ఆ ఆలోచన లేదు. అలాగే దీనికి సీక్వెల్ తీసే ప్రసక్తి లేదు..ఎందుకంటే ఆ స్కోప్ ఈ కథలో లేదని చెప్పారు. ఆ ప్రెస్ మీట్ లో ప్రసాద్ ల్యాబ్స్ రమేష్ ప్రసాద్, EFX ప్రతినిధి సాయి ప్రసాద్, స్పెషల్ ఎఫెక్ట్స్ డైరక్టర్ కమల్ కన్నన్ పాల్గొన్నారు.