Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్ సోదరిగా చేస్తున్నందుకు ఫీలవటం లేదు
హైదరాబాద్: సాధారణంగా...హీరోయిన్స్ ఒక్కసారిగా రూటుమార్చి హీరోకు చెల్లి,లేదా అక్క పాత్రలు చేయటానికి ఇష్టపడరు. కానీ భారీ ఆఫర్ పిలిస్తేను కాదనలేరు. ఇప్పుడు అలాంటి పరిస్దితే కృతి కర్భంద ఎదుర్కొంటోంది. తీన్ మార్, ఒంగోలు గిత్త చిత్రాల్లో చేసిన ఈమెకు తెలుగులో అనుకున్నంత బ్రేక్ రాలేదు. ఈ నేపధ్యంలో ఆమె రామ్ చరణ్ తాజా చిత్రంలో అతనికి సోదరిగా నటించటానికి ముందుకు వచ్చింది. ఈ విషయమై ఆమె మాట్లాడింది.
కృతి కర్భంద మాట్లాడుతూ..."చాలా మంది రామ్ చరణ్ సోదరిగా చేస్తున్నానంటే వద్దని హెచ్చరించారు. కానీ ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. అయినానేనేమీ ఈ సినిమాతో కోల్పోయేదేమీ లేదు " అంది..
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
సినిమా విషయానికొస్తే...
రామ్చరణ్ - శ్రీను వైట్ల కలయికలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్. డి.వి.వి.దానయ్య నిర్మాత. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.
చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.
నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.