twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోవా ఫిల్మ్ ఫెస్ట్‌లో...తెలుగు సినిమాకు దక్కని చోటు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి పరాభవం జరిగింది. నవంబర్ 19 నుంచి గోవాలో జరిగే 43వ'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2012'లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కూడా చోటు దక్కించుకోలేక పోయింది. ఇండియాలోని వివిధ భాషల నుంచి మొత్తం 18 సినిమాలను ఎంపిక చేసారు. మళయాలం నుంచి అత్యధికంగా 5 సినిమాలకు ఇందులో చోటు దక్కించుకున్నాయి.

    తెలుగు సినీ పరిశ్రమ నుంచి మొత్తం 9 ఎంట్రీలు వెళ్లగా అందులో కేవలం 4 సినిమాలను మాత్రమే సెంట్రల్ కమిటీ వరకు వెళ్లాయి. మొత్తం అన్నీ భాషల నుంచి 18 సినిమాలను ఎంపిక చేయగా, అందులో ఒక్క తెలుగు సినిమా కూడా స్థానం దక్కించుకోలేక పోయింది.

    ఇలా అయితే ఎలా, మావూరి జోగిని, మల్లెల తీరం, మినుగురులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఓంకారం, ప్రత్యామ్నాయం, వీరంగం చిత్రాలను ఎంట్రీకి పంపినా ఈ సినిమాల్లో కొత్తదనం, గోవా ఫిల్మ్ పెస్టివల్ లో ప్రదర్శించే అర్హత లేదనే నెపంతో కమిటీ ఈ సినిమాలను తోసి పుచ్చింది.

    గత సంవత్సరం పరిస్థితి పరిశీలిస్తే...శ్రీకాంత్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన'విరోధి' చిత్రం మాత్రమే గోవా ఫిల్మ్ ఫెస్ట్ లో స్థానం దక్కించుకుంది. ఈ సారి కనీసం ఒక్క సినిమా కూడా ఫెస్ట్ లో చోటు దక్కించుకోలేక పోవడం శోచనీయం. మరి మన తెలుగు సినిమాల్లో అంత సత్తా లేదా...కమిటీ మన తెలుగు సినిమాల పట్ల నిర్లక్ష్యం వహించిందా? తేలాల్సి ఉంది.

    English summary
    
 Not a single Telugu film will be screened at the 43rd International Film Festival of India, ( IFFI- 2012) beginning in Goa from November 19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X