Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గోవా ఫిల్మ్ ఫెస్ట్లో...తెలుగు సినిమాకు దక్కని చోటు!
తెలుగు సినీ పరిశ్రమ నుంచి మొత్తం 9 ఎంట్రీలు వెళ్లగా అందులో కేవలం 4 సినిమాలను మాత్రమే సెంట్రల్ కమిటీ వరకు వెళ్లాయి. మొత్తం అన్నీ భాషల నుంచి 18 సినిమాలను ఎంపిక చేయగా, అందులో ఒక్క తెలుగు సినిమా కూడా స్థానం దక్కించుకోలేక పోయింది.
ఇలా అయితే ఎలా, మావూరి జోగిని, మల్లెల తీరం, మినుగురులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఓంకారం, ప్రత్యామ్నాయం, వీరంగం చిత్రాలను ఎంట్రీకి పంపినా ఈ సినిమాల్లో కొత్తదనం, గోవా ఫిల్మ్ పెస్టివల్ లో ప్రదర్శించే అర్హత లేదనే నెపంతో కమిటీ ఈ సినిమాలను తోసి పుచ్చింది.
గత సంవత్సరం పరిస్థితి పరిశీలిస్తే...శ్రీకాంత్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన'విరోధి' చిత్రం మాత్రమే గోవా ఫిల్మ్ ఫెస్ట్ లో స్థానం దక్కించుకుంది. ఈ సారి కనీసం ఒక్క సినిమా కూడా ఫెస్ట్ లో చోటు దక్కించుకోలేక పోవడం శోచనీయం. మరి మన తెలుగు సినిమాల్లో అంత సత్తా లేదా...కమిటీ మన తెలుగు సినిమాల పట్ల నిర్లక్ష్యం వహించిందా? తేలాల్సి ఉంది.