Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏది వల్గారిటి? బెల్లకొండ ఓపెన్ చాలెంజ్
హైదరాబాద్:
మారుతి
దర్శకత్వంలో
ప్రముఖ
నిర్మాత
బెల్లంకొండ
సురేష్
నిర్మించిన
చిత్రం
'బస్
స్టాఫ్'.
ఇటీవల
విడుదలైన
ఈ
చిత్రం
మంచి
సక్సెస్
టాక్
సొంతం
చేసుకుంది.
అయితే
ఈచిత్రంలో
వర్గారిటీ
ఉందని
ఆ
మధ్య
ఆందోళన
కార్యక్రమాలు
జరిగిన
విషయం
తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన 'బస్ స్టాప్' సక్సెస్ మీట్లో ఓపెన్ చాలెంజ్ విసిరారు బెల్లంకొండ. సినిమాలో వల్గారిటీ ఉందనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని, థియేటర్ వచ్చి సినిమా చూస్తే సినిమాలో ఎలా ఉందో అర్థం అవుతుందని అన్నారు. మా సినిమా మంచి ఎంటర్ టైనరే కాదు... యూత్కి, పేరెంట్స్కి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని బెల్లంకొండ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాను తమిళ, కన్నడ, హిందీలో నిర్మిస్తాను అని చెప్పిన బెల్లంకొండ... మారుతి ఖాళీగా ఉంటే అతనికే దర్శకత్వం చేసే అవకాశం ఇస్తాను అని స్పష్టం చేసారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ నేను ఈ కథను నాలుగేళ్ల క్రితం రాసుకున్నాను. చాలా మంది నిర్మాతలను కలిసినా ఎవరూ ముందుకు రాలేదు. ఈ రోజు ఈ సినిమా 300 థియేటర్లలో విడుదలై విజయం సాధించిందంటే ఇదంతా బెల్లంకొండ సురేష్ గారి క్రెడిటే అన్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గణేష్ బాబు, బిఎ రాజు, మహేంద్రరెడ్డి, సంగీత దర్శకుడు జీవన్ బాబు, ప్రిన్స్, శ్రీ దివ్య, రాంబాబు, ఎఫ్.ఎం బాబాయ్, హాసిక, ఏలూరు శ్రీను, సాయి, గోపాల సాయి, ఖన్నా, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.