Don't Miss!
- News ఊపిిరి పీల్చుకున్న ఉద్యాననగరి
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘రామయ్యా వస్తావయ్య’లో నాది నెగిటివ్ పాత్ర కాదు
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కధను మలుపు తిప్పే పాత్రను చేస్తోంది. ఈ పాత్ర కథలో ఊహించని ట్విస్ట్ ఇచ్చే నెగిటివ్ షేడ్స్ తో సాగే పాత్ర అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో శృతిహాసన్ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. తనది నెగిటివ్ పాత్ర కాదని , మీరందరూ మెచ్చే స్పెషల్ గెస్ట్ క్యారెక్టర్ అని చెప్పింది.
ఇక శృతి ఉండేది కాసేపే అయినా అదరకొడుతుందని చెప్తున్నారు. శ్రుతి ఈ చిత్రంలో చేసే పాత్ర సినిమాకు, తన కెరీర్ కు కీలకమై నిలుస్తుందని చెప్తోంది. ఈ సందర్భంగా చాలా ఉద్వేగంతో ఉంది శ్రుతి. ఆ సినిమాలో శ్రుతి పోషించిన పాత్ర పేరు 'అమ్ములు'. జీవితాలను మలుపుతిప్పే పాత్రలు అరుదుగా మాత్రమే వస్తుంటాయని, తనకు వెంటవెంటనే వస్తున్నాయని ఆమె చెప్తోంది.
శ్రుతి హాసన్ మాట్లాడుతూ.... '''గబ్బర్సింగ్'లోని భాగ్యలక్ష్మి పాత్రతో నేను తెలుగమ్మాయిని అయిపోయాను. ఇక్కడ అందరూ సొంత అమ్మాయిలా చూసుకుంటున్నారు. త్వరలో రాబోతున్న 'రామయ్యా వస్తావయ్య'లో అంతకంటే గొప్ప పాత్ర చేశాను. ఇందులో నా పాత్ర పేరు 'అమ్ములు'. అచ్చతెనుగు అమ్మాయి పాత్ర అన్నమాట. 'గబ్బర్సింగ్'లో సెలైంట్గా కనిపించిన నేను, ఇందులో చలాకీగా మురిపిస్తా. ఈ సందర్భంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది హరీష్శంకర్కే. రెండు మంచి పాత్రలిచ్చి నా కెరీర్నే మార్చేశారాయన'' అంది.
'రామయ్యా వస్తావయ్య' చిత్రం అక్టోబర్లో విడుదల కానుంది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. ఇటీవల థమన్ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కు యూట్యూబ్ లో అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.